దేవరకద్ర రూరల్, అక్టోబర్ 25 : అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవానికి వేళైంది. బుధవారం నుంచి కురుమూర్తి జాతర ప్రారంభం కానున్నది. తొలి రోజు శ్రీనివాసుడికి తిరు కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. 30న స్వర్ణాభరణాలతో స్వామి అలంకారోత్సవం, 31న ప్రధాన ఘట్టమైన ఉద్దాల ఉత్సవం జరగనున్నది. వేడుకలను తిలకించేందుకు లక్షలాదిగా భక్తులు తరలిరానున్నారు. ఇందుకోసం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పేదల తిరుపతిగా కీర్తిగడించిన కు రుమూర్తి స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. 26న ఉదయం ఆవాహిత దేవతా పూజలు, ధ్వజారోహణం, దేవతాహ్వానం, భేరిపూజ, శ్రీనివాసుడి తిరు కల్యాణోత్సవం, మహానివేదన, శాత్తుమురై, మంగళనీరాజనం, సాయంత్రం 6:15కు శ్రీదేవి, భూదేవి సమేత స్వామి వారి మ యూర వాహన సేవ నిర్వహించనున్నారు.
27న ఉ దయం ఆవాహిత దేవతా పూజలు, హోమాది కార్యక్రమాలు, సాయంత్రం 6:20కు హంసవాహన సేవ, శా త్తుమురై, మంగళనీరాజనం.., 28న ఉదయం పూజ లు, సాయంత్రం 6:25కు శేషవాహన సేవ, 29న ఉద యం పూజలు, సాయంత్రం 6:25కు గజవాహన సేవ, 30న ఉదయం 8:15కు పూజలు, సాయంత్రం 5:30 నుంచి స్వామి వారికి స్వర్ణాభరణాలతో అలంకార ఉ త్సవం, రాత్రి 8:45 నుంచి స్వామి వారి దర్శనం భా గ్యం కల్పించనున్నారు. ఆదివారం పంచమి, షష్టి తిథు లు ఉన్న కారణంగా శ్రీదేవి, భూదేవి సమేత స్వామి వా రికి అశ్వవాహన, హనుమద్వాహన సేవ నిర్వహించనున్నారు. 31న ఉదయం పూజలు, సాయంత్ర 6:30కు బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన ఉద్దాల ఉత్సవం, రాత్రి 10:45కు గరుఢవాహన సేవ, శాత్తుమురై, మంగళనీరాజనం కార్యక్రమాలు చేపట్టనున్నారు. 1న ఆవాహిత దావతా పూజలు, హోమం, శ్రీపుష్పయాగం, శాత్తుమురై, మంగళనీరాజనం, 2న ఉదయం 9 గంటలకు అవబృతం, 10వ తేదీన ఉదయం స్వామి వారి పూజల అనంతరం అలంకారాన్ని తీయనున్నారు.