మహబూబ్నగర్టౌన్, డిసెంబర్ 7: క్రీడాకారులకు బంగారు భవిష్యత్తు ఉంటుందని, చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని పాలమూరు విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ లక్ష్మీకాంత్రాథోడ్ అన్నారు. తమిళనాడులోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఈనెల 13 నుంచి 16 వరకు మహిళలకు, 18నుంచి 22 వరకు పురుషులకు ఆల్ఇండియా ఇంటర్ యూనివర్సిటీ వాలీబాల్ సౌత్జోన్ పోటీలు పోటీల్లో పాల్గొనే పాలమూరు యూనివర్సిటీ జట్ల ఎంపికలను మంగళవారం పీయూలో నిర్వహించారు. ఈ సందర్భంగా పీయూ వీసీ మాట్లాడుతూ సౌత్జోన్ టోర్నీలో ప్రతిభ చాటి జట్టు విజయానికి కృషి చేయాలని ఆకాంక్షించారు. యూనివర్సిటీ క్రీడాకారులు సౌత్జోన్, ఆల్ఇండియా యూనివర్సిటీ టోర్నీలో ఎంతో మంది రాణించారని గుర్తుచేశారు. క్రీడాభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో పీడీ బాల్రాజ్గౌడ్, డిగ్రీ కళాశాల పీడీలు శ్రీనివాస్రెడ్డి, కవిత, స్వేత, లక్ష్మీ, వాలీబాల్ సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ చెన్నవీరయ్య, వాలీబాల్ కోచ్ పర్వేజ్ పాల్గొన్నారు.
మహిళ జట్టు: నందిని, నవ్యశ్రీ, సునీత, అంజలి, ఫ్రాన్సీ, డొండనేహ, రేణుక, సంధ్యదీప్తి, డి.శ్రావణి, సుధారాణి, సాగరిక, జ్యోతి, సుష్మ, భారతి, తేజశ్విని.
పురుషుల జట్టు:
జయసింహ, కృష్ణప్రసాద్, విజయ్కుమార్, సోహెల్, అమీర్, మహ్మద్బషీర్, హబీబుద్దీన్, ప్రతాప్, యాసిన్, నరేశ్, నవీన్, అమరేందర్, హలీం, వెంకటేశ్, రాజు, కల్తీవంశీ, శ్రీచరణ్, వినయ్, అశోక్, అయోధ్యరామ్.