మక్తల్ టౌన్, అక్టోబర్ 13 : రాబోయే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలో ఓటు హక్కును ఏ విధంగా నమోదు చేసుకోవాలని ఉపాధ్యాయులకు పీఆర్టీయూ టీఎస్ ఆధ్వర్యంలో గురవారం అవగాహన కల్పించామని జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డి అన్నారు. స్థానిక పాఠశాలలో ఆయన మాట్లాడుతూ త్వరలో రాష్ట్రంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఉపాధ్యాయులకు అవగాహన కల్పించామని పేర్కొన్నారు. ఓటు హక్కును నమోదు చేసుకొని ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతిఒక్కరూ వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో పీఆర్టీయూ టీఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, సంఘం నాయకులు తిరుమల్రావు, వీరేశ్బాబు, కుమార్, నాగరాజు, వెంకటేశ్, బాబు, రాము, మారుతి తదితరులు పాల్గొన్నారు.
నారాయణపేట రూరల్, అక్టోబర్ 13 : ఉపాధ్యాయుల సమస్యల సాధన పీఆర్టీయూ టీఎస్కే సాధ్యమని జిల్లా కార్యదర్శి జనార్దన్రెడ్డి అన్నారు. మండలంలోని కోటకొండ, బొమ్మన్పాడ్ ఉన్నత పాఠశాలల్లో గురువారం ఉపాధ్యాయులకు ఓటు హక్కు నమోదు కార్యక్రమం చేపట్టారు. అనంతరం తిర్మలాపూర్, బండగొండ, అభంగాపూర్ ప్రాథమికోన్నత పాఠశాలలు, ఊటకుంటతండా, గనిమోనిబండ ప్రాథమిక పాఠశాలల్లో ఓటు హక్కు నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తుందని, పాఠశాలల స్థితిగతులు కూడా మారుతాయన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్ష, కార్యదర్శులు రఘువీర్, జనార్దన్, కాంప్లెక్స్ హెచ్ఎంలు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
మాగనూర్, అక్టోబర్ 13 : ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని అర్హత గల ఉపాధ్యాయులందరూ ఓటు హక్కు నమోదు చేసుకోవాలని పీఆర్టీయూ టీఎస్ మండల అధ్యక్షుడు నరేందర్ అన్నారు. మండలంలోనికస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల ఉపాధ్యాయులు, వడ్వాట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులకు గురువారం అవగాహన కల్పించారు. అలాగే ఉపాధ్యాయులకు ఫామ్ 19 అందజేశారు. కార్యక్రమలో పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు, సభ్యులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.