మహబూబ్నగర్, అక్టోబర్ 10 : అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమానికి ప్రధానమంత్రి 15 సూత్రాల పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని అదనపు కలెక్టర్ సీతారామారావు అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని వీసీహాల్లో సంబంధిత అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. విద్య, ఉపాధి, స్కిల్ డెవలప్మెంట్, పింఛన్లు తదిత ర అంశాలపై జిల్లాస్థాయి కమిటీ మైనార్టీలకు అవగాహన కల్పించి పథకం ఉద్దేశం నెరవేరేలా కృషి చేయాలని సూచించారు. మైనార్టీ విద్యాసంస్థల్లోని ల్యాబుల్లో పరికరాలను సమకూర్చడంతోపాటు విద్యార్థులకు వైద్యసేవలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. కళాశాలలు ఇతర పాఠశాలలను 15 సూత్రాల కార్యక్రమం అమలు సభ్యులు సందర్శించాలని సూచించారు. కాగా, ముఖ్యమంత్రి ఓవర్సీస్ విద్యానిధి కింద విద్యార్థులకు విదేశీ విద్య అభ్యసించే అవకాశం కల్పించాలని పలువురు సభ్యులు కోరారు. అనంతరం నిర్వహించిన జిల్లా వక్ఫ్ సమన్వయ కమిటీ సమావేశంలో అధ్యక్షుడు అన్వర్పాషా మాట్లాడారు.
మహబూబ్నగర్ పట్టణంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లోని వక్ఫ్ ఆస్తులకు కంచెలను ఏర్పాటు చేయాలన్నారు. శ్మశానవాటికలు అన్యాక్రాం తం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. వక్ఫ్ ఆస్తుల పూర్తి వివరాలతోకూడిన కాపీని సభ్యులకు ఇవ్వాలని, కోర్టు కేసులకు సంబంధించిన సమాచారాన్ని కూడా సభ్యులకు తెలియజేయాలని అదనపు కలెక్టర్ సీతారామారావు సంబంధిత అధికారులను ఆదేశించారు. సమావేశంలో 15 సూత్రా ల కార్యక్రమ కమిటీ, వక్ఫ్ కమిటీ సభ్యులు అన్వర్పాషా, నజీమున్నిసాబేగం, శామ్యూల్ విక్టర్, సయ్యద్ సుల్తా న్, జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు అన్వర్పాషా, సర్పంచ్ జరీనాబేగం, నాజర్ బిన్, మైనార్టీ సంక్షేమశాఖ జిల్లా అధికారి శంకరాచారి, ఆర్డీవో అనిల్కుమార్, డీఎస్పీ మహేశ్ ఉన్నారు.
రైతులకు న్యాయం చేస్తాం
రోడ్డు విస్తరణలో భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేస్తామని అదనపు కలెక్టర్ సీతారామారావు అన్నారు. మండలంలోని సల్కర్పేటలో సోమవారం చేపట్టిన రోడ్డు విస్తరణ సర్వే పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణంతో రైతులు ఎంత మొత్తంలో భూములను కోల్పోతున్నారన్న వివరాలను సమగ్రంగా సేకరించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నట్లు తెలిపారు. త్వరలోనే నాలుగులేన్ల రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని, మండలంలోని రైతులు సహకరించాలని కోరా రు. కార్యక్రమంలో ఆర్డీవో అనిల్కుమార్, నేషనల్ హైవే డీఈ తదితరులు పాల్గొన్నారు.