మహబూబ్నగర్ అర్బన్, అక్టోబర్ 9 : దశాబ్దాలుగా సామాజికంగా వెనుకబడిన వాల్మీకి బోయలకు ప్రభు త్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఆదివారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని నవాబ్పేట రోడ్పై ఉన్న బోయపల్లి గేట్ సమీపంలో వాల్మీకి రామాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మంత్రి ముఖ్య అథితిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చే అంశంపై మంత్రి ఇంద్రకరణ్రెడ్డి ఆధ్వర్యంలో న్యాయమైన చిక్కులను అధిగమించే ప్రయత్నం జరుగుతున్నదన్నారు. సమాజంలో అందరూ బాగుండాలనే ఉద్దేశంతో ప్రతి కులానికి స్థలమిచ్చి ఆదుకుంటున్నట్లు తెలిపారు. వాల్మీకులకు బైపాస్ సమీపంలో విలువైన ఎకరా స్థలాన్ని కేటాయించామని పేర్కొన్నారు. కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నిధులు సైతం కేటాయించినట్లు వివరించారు. అనంతరం జిల్లా వాల్మీకి సంఘం పాలమూ ర్ సాహితీ సయుక్త ఆధ్వర్యంలో యువ కవి కోలంట్ల రామకృష్ణ రచించిన ‘వాల్మీకి మొగ్గలు’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, ముడా చైర్మన్ గంజి వెంకన్న, వైస్ చైర్మన్ గణే శ్, జెడ్పీ డిప్యూటీ సీఈవో మొగులప్ప, వాల్మీకి సంఘం జిల్లా అధ్యక్షుడు, కౌన్సిలర్ రాంలక్ష్మణ్, కృష్ణయ్య, కోస్గి ఎక్సైజ్ సీఐ బాలకృష్ణ, వెంకటయ్య, సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మైనార్టీల సంక్షేమానికి కృషి
మహబూబ్నగర్ టౌన్, అక్టోబర్ 9 : మైనార్టీల సంక్షే మానికి ప్రభుత్వం కృషిచేస్తున్నదని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని అల్మాస్ ఫంక్షన్హాల్లో, మోతీనగర్ మసీదులో మిలాదున్నబీ సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రక్తదానం చేయడం, రక్తదాతలు ప్రాణాదాతలుగా మారడం గొప్ప విషయమన్నారు. తెలంగాణలో మైనార్టీల సంక్షేమానికి ఎన్నో పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. షాదీముబారక్, ఇమామ్, మౌజన్లకు గౌరవ వేతనం, రంజాన్ తోఫాలు, మైనార్టీ గురుకుల పాఠశాలను ఏర్పాటు చేసి మెరుగైన విద్యాబోధన చేస్తున్నట్లు చెప్పారు. భారీ వర్షాలతో పట్టణంలోని లోతట్టు ప్రాంతాల్లో డ్రైనేజీలు, రోడ్ల అభివృద్ధికి సీఎం కేసీఆర్ రూ.100 కోట్ల నిధులు మంజూరు చేశారన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, ముడా చైర్మన్ గంజివెంకన్న, మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్ రహెమాన్, వక్ఫ్ ప్రొటెక్షన్ కోఆర్డినేషన్ కమిటీ సభ్యుడు అన్వర్పాపా, షఫీ, కౌన్సిలర్లు షబ్బీర్, షేక్ఉమర్, నర్సింహులు, నాయకులు జావిద్బేగ్, తయ్యబ్, ఎజాజ్ అబ్దుల్లా, ఇబ్రాహీ, సయ్యద్ సిద్ధిక్ హుస్సేన్, అబ్దుల్లా, అబ్రారర్ పాల్గొన్నారు.
పాలమూరులో పెరిగిన ఉపాధి అవకాశాలు
జడ్చర్ల, అక్టోబర్ 9 : కష్టపడే యువతకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. ఆదివారం జడ్చర్ల-మహబూబ్నగర్ ప్రధాన రహదారిపై కొత్తతండా సమీపంలో దళితబంధు పథకం ఆర్థిక సాయంతో ఏర్పాటు చేసిన బ్రిక్స్, పేపర్ప్లేట్ల యూనిట్లను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వలసల జిల్లాగా పేరుగాంచిన పాలమూరు నేడు ఉపాధి అందించే స్థాయికి ఎదిగిందన్నారు. యువతకు స్థానికంగానే ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని తెలిపారు. ఉపాధితో లబ్ధిపొంది పది మందికి ఉద్యోగావకాశాలు కల్పించాలని సూచించారు. తెలంగాణ ఏర్పడ్డాక మహబూబ్నగర్ అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నదన్నారు. హైదరాబాద్కు సమీపంలో ఉండడంతో ప్రగతి బాటలు పడుతున్నాయన్నారు. దళితబంధుతో నిరుద్యోగులు జీవితం లో వెలుగులు నిండాయని చెప్పారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.