ఊట్కూర్, అక్టోబర్ 9 : ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన ఆసరా పింఛన్ లబ్ధిదారులకు ఆదివారం మల్లేపల్లి, పులిమామిడి గ్రామాల్లో అధికారులు డబ్బులను పంపిణీ చేశారు. ఆయా గ్రామాల్లో వైస్ ఎంపీపీ ఎల్లాగౌడ్, సర్పంచులు మాట్లాడుతూ సంక్షేమ పథకాల అమలులో దేశంలో నే రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందన్నారు. పింఛన్ డబ్బులను లబ్ధిదారులు వృథాగా ఖర్చు చేయకుండా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ బాలస్వామి, బీపీఎం సిద్ధ్దార్థ, నాయకులు, లబ్ధిదారులు తదిత రులు పాల్గొన్నారు.
పిడ్డెంపల్లిలో…
దామరగిద్ద, అక్టోబర్ 9 : మండలంలోని పిడ్డెంపల్లిలో ప్రభుత్వం అందజేస్తున్న ఆసరా పింఛన్లను మాజీ సర్పంచ్ వీరప్ప లబ్ధిదారులకు ఆదివారం గ్రామ పంచాయతీ ఆవరణలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది వరకే గ్రామంలో అర్హులైన వారితోపాటు కొ త్తగా మంజూరైన 39 మందికి పింఛన్లు అందించామన్నారు. కార్యక్రమం లో పోస్టాఫీస్ అధికారి రామ్ నాయక్, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
మాగనూర్ మండలంలో…
మాగనూర్, అక్టోబర్ 9 : ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆసరా పింఛన్లను గ్రామ పంచాయతీ ఆవరణలో ఆదివారం నూతనంగా మంజూరైన పింఛన్దారులకు జేడ్పీటీ సీ వెంకటయ్య, ఎంపీపీ శ్యామలమ్మ, పోస్ట్మాస్టర్ ధనంజయ్, సర్పంచ్ రా జు డబ్బులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు ఎం తో అదృష్టవంతులన్నారు. అనంతరం పింఛన్ లబ్ధిదారులు సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ (బీఆర్ ఎస్) సీనియర్ నాయకుడు మధుసూదన్రెడ్డి, వార్డు మెం బర్లు, పింఛన్దారులు తదితరులు పాల్గొన్నారు.