మహబూబ్నగర్, అక్టోబర్ 9 : రామాయణ మహాకావ్య రచయిత వాల్మీకి మహర్షిని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని కలెక్టర్ ఎస్.వెంకట్రావు అన్నారు. బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఆదివారం కలెక్టరేట్లో వాల్మీకి మహర్షి జయంతిని ఘ నంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ వాల్మీకి మహర్షి రామాయణ గ్రం థాన్ని రచించి పరిపూర్ణమైన విలువలను సమాజానికి అందించారని కొనియాడారు. మానవతా విలువలు, ఉన్నతమైన ఆదర్శాలను మనిషికి అడుగడుగునా బోధించేలా రామాయణ కావ్యాన్ని రచించారని తెలిపారు. నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాలని కోరారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమశాఖ జిల్లా అధికారి ఇందిర, మైనార్టీ సంక్షేమశాఖ జిల్లా అధికారి శంకరాచారి, పరిశ్రమలశాఖ అధికారి బాబూరావు పాల్గొన్నారు. అదేవిధంగా మహబూబ్నగర్ మండలం చౌదర్పల్లిలో జై హనుమాన్ వాల్మీకి సంఘం ఆధ్వర్యం లో వాల్మీకి మహర్షి జ యంతిని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఉపసర్పం చ్ వెంకటయ్య, వార్డుసభ్యుడు కుర్మయ్య, నర్సింహులు, ఖాజాన్గౌడ్, కుర్మయ్య, చెన్నకేశవులు, కొండయ్య, కేశవులు, నాగరాజు, రాజయ్య, దాసు పాల్గొన్నారు.
మహబూబ్నగర్ పట్టణంలో..
మహబూబ్నగర్టౌన్, అక్టోబర్ 9 : మహబూబ్నగర్ మున్సిపల్ కార్యాలయం లో వాల్మీకి మహర్షి జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించా రు. కార్యక్రమంలో ముడా చైర్మన్ గంజి వెంకన్న, మున్సిపల్ వైస్చైర్మన్ తాటి గణేశ్, కౌన్సిలర్ షేక్ఉమర్, శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జడ్చర్ల పట్టణంలో..
జడ్చర్ల/టౌన్, అక్టోబర్ 9 : జడ్చర్ల ము న్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మి వాల్మీకి మహర్షి చిత్రపటానికి ప్రత్యేక పూజలు చేశారు. అలాగే అంజనాద్రినగర్కాలనీలో ఉమెన్స్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో వాల్మీకి జయంతి వే డుకలను ఘనంగా నిర్వహించారు. మండలంలోని కుర్వపల్లిలో వాల్మీకి సంఘం ఆధ్వర్యంలో వాల్మీకి విగ్రహానికి పూలమా ల వేసి పూజలు చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు చైతన్యచౌహాన్, సతీశ్, మున్సిపల్ ఆర్వో శశిధర్, సర్పంచ్ శ్రీనివాసులు, ఉమెన్స్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షురాలు బాలమణి, గోపాల్గౌడ్, గోనెల రాధాకృష్ణ, వాల్మీకి సంఘం నాయకులు ఎంబీ బాలకృష్ణ, గోపి, పర్మటయ్య, యాద య్య తదితరులు పాల్గొన్నారు.
రాజాపూర్ మండలంలో..
రాజాపూర్, అక్టోబర్ 9 : మండలంలో వాల్మీకి మహర్షి జయంతిని ఘనంగా నిర్వహించారు. తాసిల్దార్, గ్రామపంచాయతీ కార్యాలయాల్లో వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి పూజలు చేశారు. కార్యక్రమంలో తాసిల్దార్ రాంబాయి, ఆర్ఐ కదీ ర్, సర్పంచుల సంఘం మండల అధ్యక్షు డు బచ్చిరెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు నర్సింహులు, కోఆప్షన్ సభ్యు డు అల్తాఫ్, వాల్మీకి సంఘం నాయకులు కుర్మయ్య, దస్తగిరి, నరహరి, దేవేందర్, అచ్చయ్య, శ్రీనివాస్ పాల్గొన్నారు.
మిడ్జిల్ మండలంలో..
మిడ్జిల్, అక్టోబర్ 9 : మండల పరిషత్ కార్యాలయంలో వాల్మీకి మహర్షి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంపీపీ కాంతమ్మ, వైస్ఎంపీపీ తిరుపతమ్మ, ఎంపీవో అనురాధ, ఎంపీటీ సీ గౌస్, ఆర్ఐ రామాంజనేయులు, నా యకులు వెంకట్రెడ్డి, బాలస్వామి, రవిగౌ డ్, మల్లయ్య, శేఖర్ పాల్గొన్నారు.
బాలానగర్ మండలంలో..
బాలానగర్, అక్టోబర్ 9 : మండలంలోని నేరళ్లపల్లిలో వాల్మీకి మహర్షి జయం తి వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూ లమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ ఖలీల్, కోఆప్షన్ సభ్యుడు జమీర్పాషా, శేఖర్ పాల్గొన్నారు.
నవాబ్పేట మండలంలో..
నవాబ్పేట, అక్టోబర్ 9 : మండల పరిషత్ కార్యాలయం, కాకర్లపహాడ్ గ్రామపంచాయతీలో వాల్మీకి మహర్షి జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారులు వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంపీపీ అనంతయ్య, తాసిల్దార్ రాజేందర్రెడ్డి, సర్పంచులు గోపాల్గౌడ్, పాశం జంగమ్మ, కోఆప్షన్ సభ్యుడు తాహేర్, ఆర్ఐలు గోవర్ధన్, కిరణ్కుమార్ పాల్గొన్నారు.
భూత్పూర్ మండలంలో..
భూత్పూర్, అక్టోబర్ 9 : మండల పరిషత్ కార్యాలయంలో వాల్మీకి మహర్షి జ యంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైస్ఎంపీపీ నరేశ్గౌడ్ వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ (బీఆర్ఎస్)నాయకులు నారాయణగౌడ్, గో ప్లాపూర్ సత్యనారాయణ, నర్సింహ, సీనియర్ అసిస్టెంట్ బాలరాజు పాల్గొన్నారు.
ఆదికవి వాల్మీకి
మూసాపేట(అడ్డాకుల), అక్టోబర్ 9 : రామాయణ మహాకావ్యాన్ని రచించిన వాల్మీకి మహర్షి ఆదికవిగా చరిత్రలో నిలిచిపోయారని అడ్డాకుల ఎంపీపీ దోనూరు నాగార్జునరెడ్డి అన్నారు. మండల పరిషత్ కార్యాలయం, పొన్నకల్ గ్రామపంచాయతీలో నిర్వహించిన వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించా రు. అలాగే అడ్డాకుల సంతబజార్లో వాల్మీకి విగ్రహానికి గ్రామస్తులు పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంపీడీవో మంజుల, తాసిల్దార్ కిషన్, వాల్మీకి సంఘం జిల్లా అధ్యక్షుడు కృష్ణ య్య, జెడ్పీ మాజీ కోఆప్షన్ సభ్యుడు మహమూద్, సర్పంచ్ కల్పనావిజయ్కుమార్రె డ్డి, టీవీ కుర్మయ్య, భీమన్నయాదవ్, శ్రీనివాస్రెడ్డి, చంద్రమోహన్రెడ్డి పాల్గొన్నారు.
మూసాపేట మండలంలో..
మూసాపేట, అక్టోబర్ 9 : మండలకేంద్రంతోపాటు నిజాలాపూర్, చక్రాపూర్, తుంకినీపూర్, అచ్చాయిపల్లి, జానంపేట, వేముల, నందిపేట, కొమిరెడ్డిపల్లి తదితర గ్రామాల్లో వాల్మీకి మహర్షి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంపీపీ గూపని కళావతీకొండయ్య, చంద్రశేఖర్, శ్రీనివాసులు, శైలజాప్రకాశ్రెడ్డి, లక్ష్మణ్, వన్నం ఆంజనేయులు, ఉందెకోడు తిరుపతయ్య, కావలి నారాయణ, వెంకటయ్య, బాలన్న, రాజు పాల్గొన్నారు.
కోయిలకొండ మండలంలో..
కోయిలకొండ, అక్టోబర్ 9 : మండల పరిషత్ కార్యాలయంలో వాల్మీకి మహర్షి జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంపీడీవో జయరాం, సూపరింటెండెంట్ హరీశ్వర్రెడ్డి, ఆంజనేయులు, ప్రవీణ్, సింగిల్విండో చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, సర్పంచ్ కృష్ణయ్య, నాయకులు భీంరెడ్డి, జగన్గౌడ్ పాల్గొన్నారు.
మహ్మదాబాద్ మండలంలో..
మహ్మదాబాద్, అక్టోబర్ 9 : మండలంలోని దేశాయిపల్లిలో వాల్మీకి మహర్షి జ యంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సం దర్భంగా వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి పూజలు చేశారు. కార్యక్రమంలో స ర్పంచ్ రాఘవేందర్, నాయకులు వెంకట య్య, అంజిలయ్య, చెన్నయ్య ఉన్నారు.
దేవరకద్ర, సీసీకుంట మండలాల్లో..
దేవరకద్ర రూరల్, అక్టోబర్ 9 : దేవరకద్ర, చిన్నచింతకుంట మండల కేంద్రాలతోపాటు పలు గ్రామాల్లో ఆదికవి వాల్మీకి మహర్షి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహం, చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.