నాగర్కర్నూల్టౌన్, అక్టోబర్ 3 : జిల్లా కేంద్రంలోని పలు యువజన సంఘాల ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన అమ్మవారికి ఎనిమిదోరోజు విశిష్ట పూజలు నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని తుల్జాభవానీ మాత మండపం వద్ద అభిషేకాలు, అష్టోత్తర శతనామ పూజ, సరస్వతీ మాత పూజ, మ హాహారతి, కాగడ హారతి, లక్ష్మీహోమ కార్యక్రమాలను సూ ర్యవంశ ఆరెకటిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. పట్టణంలోని ఆయోధ్య యూత్, మైల్స్టోన్, శ్రీరామ యూత్, భజరంగ్దళ్ తదితర యువజన సంఘాల ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన అమ్మవార్లకు భక్తులు పూజలు నిర్వహించారు.
కల్వకుర్తి, అక్టోబర్ 3: దేవీ శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా కల్వకుర్తి పట్టణంలోని కన్యకా పరమేశ్వరీ ఆలయం లో వాసవీమాత దుర్గాదేవి అలంకరణలో భక్తులకు దర్శన మిచ్చారు. ఢిల్లీలో రాష్ట్ర అధికార ప్రతినిధి మంద జగన్నా థం, పర్యాటక శాఖ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్, ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి, ఆర్య వైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ, జెడ్పీటీసీ భరత్ప్రసాద్, మాజీ బీసీ కమిషన్ సభ్యుడు ఆచారి, ఆనంద్కుమార్, గోవర్ధన్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆహ్వాని తులకు ఆలయ ట్రస్టు చైర్మన్ జూలూరి రమేశ్ బాబు సన్మా నించి జ్ఞాపికలు అందజేశారు. బతుకమ్మ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు.
కల్వకుర్తి రూరల్, అక్టోబర్ 3 : మండలంలోని ఆయాగ్రామాల్లో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. సోమవారం అమ్మవారు సరస్వతీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. లింగసానిపల్లి గ్రామంలో భక్తులు అన్నదానం చేశారు. అదే విధంగా కల్వకుర్తి పట్టణంలోని గాంధీనగర్ కాలనీలోని పెద్దమ్మతల్లి యూత్ఆధ్వర్యం లో సీతారామాంజనేయస్వామి ఆలయంలో ప్రతిష్ఠించిన అమ్మవారిని దుర్గామాతగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు.
వెల్దండ అక్టోబర్ 3: మండలకేంద్రంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన అమ్మవారు సోమవారం దుర్గాదేవి అలంకరణలో దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా మిర్యాల రాజయ్య, పద్మ, అల్లంపల్లి కృష్ణ, అనిత దంపతులు పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదానం చేశారు. ఉత్సవాల్లో పర్యాటక శాఖ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్, ఆర్య వైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షులు అమరవాది లక్ష్మీ నారా యణ, గణేశ్, ఆమన్గల్ మాజీ జెడ్పీటీసీ కండె హరిప్రసాద్ పాల్గొని పూజలు నిర్వహించారు. అనంతపురం ముఖ్య అతిథులను జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు బచ్చు రామకృష్ణ శాలువాలతో సన్మానించారు. కార్యక్ర మంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు పూరి రమేశ్, శివ, రాఘవేందర్, సంతోష్ పాల్గొన్నారు.
తిమ్మాజిపేట, అక్టోబర్ 3 : దేవీశరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మండలంలో వివిధ గ్రామాల్లో ప్రతిష్ఠించిన అమ్మవారు సోమవారం దుర్గాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. పలు గ్రామాల్లో భక్తులకు నిర్వాహకులు అన్నదానం చేశారు.