వనపర్తి, అక్టోబర్ 3 : తెలంగాణ ఉద్యమ నా యకుడిగా, న్యాయవాద వృత్తిలో లెజెండ్గా, బీడు బారిన పంట పొలాలకు సాగునీరందిస్తూ నీళ్ల నిరంజనుడిగా పేరుగాంచాడు. స్వరాష్ట్ర ఉద్యమ సమయంలో తన భుజస్కంధాలపై తెలంగాణ జెండాను మోస్తూ ఉమ్మడి పాలమూరును ఏకంచేసి.. ముఖ్యమైన పాత్రను పోషించాడు. ఆయనే వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి. వనపర్తి నియోజకవర్గాన్ని కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చేస్తున్నాడు. దశాబ్దాలపాటు కలగా మిగిలిన రోడ్ల విస్తరణను చేపట్డాడు. పక్కనే కృష్ణమ్మ పారుతున్నా.. సాగునీటికి నోచుకోని వనపర్తిలో నేడు ఎటుచూసినా పుష్కలంగా జలాలు పారుతున్నాయి. ఇదంతా సీఎం కేసీఆర్, మంత్రి నిరంజన్రెడ్డి పుణ్యమేనని రైతులు చెబుతున్నారు. ఎస్ఎన్ఆర్ ట్రస్ట్తో ఎంతో మంది అభ్యాగులకు నేనున్నాంటూ భరోసా కల్పిస్తున్నాడు. నియోజకవర్గంలో నిరంజన్రెడ్డి ముందు.. తరువాత అన్నట్లు అభివృద్ధి జరిగింది. నేడు ఆయన జన్మదినం సందర్భంగా ప్రత్యేక కథనం..
2001లో కేసీఆర్ మలిదశ ఉద్యమం ప్రారంభించారు. దక్షిణ తెలంగాణ నుంచి ఉద్యమ స్ఫూర్తిని భుజాన వేసుకొని ముందుకు సాగిన తొలి ఉద్యమ సైనికుడు సింగిరెడ్డి నిరంజన్రెడ్డి. టీడీపీ, కాంగ్రెస్లు బలంగా ఉండడం.., ఆ పార్టీ నేతలు ఉద్యమాన్ని అణచాలని చూస్తుండడం.., అక్రమ కేసులు పెట్టడం.., వివిధ రకాలుగా వేధింపులకు గురిచేయడం వంటివి చేస్తున్న తరుణంలో నిరంజన్రెడ్డి తెలంగాణ వాదులకు అండదండగా నిలిచారు. న్యాయవాదిగా ప్రజల్లో మంచి పేరున్న సమయంలో ఆ వృత్తిని వీడి ఎటువంటి పదవులు ఆశించకుండా కేసీఆర్తో కలిసి ఉద్యమంలో పాలు పంచుకున్నాడు.
ఉద్యమనేత కేసీఆర్, ప్రొఫెసర్ జయశంకర్సార్తో కలిసి తెలంగాణ ఉద్యమ తీరు తెన్నలపై చర్చించే అరడజన్ మంది కీలక వ్యక్తుల్లో నిరంజన్రెడ్డి ఒకరు. ఇలా కేసీఆర్ వెన్నంటి నిలిచాడు. 2009లో కేసీఆర్ మహబూబ్నగర్ ఎంపీగా విజయం సాధించడంలో కీలకం గా వ్యవహరించారు. కాగా, తెలంగాణ ఏర్పడిన తరువాత నిరంజన్రెడ్డికి సీఎం కేసీఆర్ అత్యంత కీలకమైన పదవి(ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు)ని కట్టబెట్టారు. ముఖ్యమంత్రితో ఉన్న పరిచయంతో కోట్ల నిధులు రప్పించగలిగాడు. వీటితో నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకూ నీరందించడంలో సఫలీకృతుడయ్యాడు. ఎంజీకేఎల్ఐ ద్వా రా లక్షల ఎకరాలకు నీరందించి నీళ్ల నిరంజన్రెడ్డిగా పేరు సంపాదించాడు.
ఎన్నికల్లో ఓడినా ప్ర జల మనస్సులు గెలిచాడు. ఆ తరువాత వచ్చిన ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించారు. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంజన్రెడ్డిని వ్యవసాయ శాఖ మంత్రిగా నియమించారు. ఆనాటి నుంచి నేటి వరకు రాష్ట్రంలో వ్యవసాయాన్ని దేశంలోనే నెంబర్వన్గా నిలిపాడు. అంతేకాకుండా జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధికంగా సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి పథకాల చెక్కులను పంపిణీ చేసి లబ్ధిదారులతో సహపంక్తి భోజనం చేస్తూ ఆప్యాయంగా పలకరిస్తున్నాడు. పల్లెనిద్ర కార్యక్రమం లో గ్రామాల్లోని సమస్యలను తెలుసుకొని వెంటనే పరిష్కరిస్తున్నారు. ఎస్ఎన్ఆర్ ట్రస్ట్ ద్వారా నిరుద్యోగులకు 45 రోజులపాటు ఉచిత కోచింగ్, స్టడీ మెటీరియర్ అందజేయడంతోపాటు భోజన వసతి కల్పించారు. దాదాపు 300 వందల మంది మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. కరోనా ఆపత్కాలంలో పేదలకు నిత్యావసర సరుకులు అందజేశారు.