మూసాపేట, నవంబర్ 18 : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రైతును ఆగం చేయొద్దని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని ఇందిరాపార్కులో గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో చేపట్టిన మహాధర్నాలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ పాలన రైతుకు బలిపీఠం, రైతు బతుకుతో చెలగాటమాడుతున్నదని ప్లకార్డు ప్రదర్శించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ‘నమస్తే తెలంగాణ’తో ఎమ్మెల్యే ఆల ఫోన్లో మాట్లాడుతూ అన్నివిధాలా అభివృద్ధి చెందుతూ ప్రశాంతంగా ఉన్న తెలంగాణ రాష్ర్టాన్ని అల్లకల్లోలం చేసేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుట్ర చేస్తున్నారన్నారు. కేంద్రం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా దేశం మొత్తం రైతులు ఆందోళన చేస్తుండగా, బండి సంజయ్ నక్క జిత్తులతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. తెలంగాణ రైతాంగంపై నిజమైన ప్రేమ ఉంటే ప్రతి గింజనూ కొంటామని కేంద్రం నుంచి స్పష్టమైన హామీపత్రం తీసుకురావాలని డిమాండ్ చేశారు.
మహాధర్నాకు తరలిన గులాబీ దండు
యా సంగిలో పండించిన ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ ఇందిరాపార్కులో చేపట్టిన మహాధర్నాకు ఉమ్మడి గండీడ్ మండలంలోని టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పెద్దఎత్తున తరలివెళ్లారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ కేం ద్ర ప్రభుత్వం రైతులు పండించిన పంటను కొనుగోలు చేయడంపై నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నారు. కార్యక్రమంలో వైస్ఎంపీపీ ఈశ్వరయ్యగౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు భిక్షపతి, పెంట్యానాయక్, టీఆర్ఎస్ యువజన నా యకుడు వెంకట్రాములు, కోఆప్షన్ సభ్యుడు స లీం, కేశవులు, గోపాల్రెడ్డి, రాజ్కుమార్రెడ్డి, కరుణాకర్రెడ్డి, ఎల్గరి వెంకట్రెడ్డి, మాణిక్యం, దశరథ్, రవీందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నవాబ్పేట నుంచి..
ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరికి నిరసనగా సీఎం కేసీఆర్ పిలుపుమేరకు చేపట్టిన మహాధర్నాకు నవాబ్పేట మండలంలోని వివిధ గ్రామాల నుంచి టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు తరలివెళ్లారు. ధర్నాకు వెళ్లిన వారిలో ఎంపీపీ అనంతయ్య, జెడ్పీటీసీ రవీందర్రెడ్డి, సింగిల్విండో చైర్మన్ మాడెమోని నర్సింహులు, వైస్ఎంపీపీ సంతోష్రెడ్డి, సర్పంచులు గోపాల్గౌడ్, యాదయ్య, లక్ష్మారెడ్డి, సత్యం, వెంకటేశ్, నర్సింహానాయక్, నాయకులు నాగిరెడ్డి, ప్రతాప్, లక్ష్మయ్య, గాండ్ల రవి, యాదయ్య ఉన్నారు.
రాజాపూర్ నుంచి..
మహాధర్నాకు మండల నాయకులు భారీగా తరలివెళ్లారు. ధర్నా కు వెళ్లిన వారిలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీశైలంయాదవ్, రైతుబంధు సమితి అధ్యక్షుడు నర్సింహులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ దేవేందర్, శ్రీనివాస్, వెంకటేశ్, తిరుపతియ్య, నర్సింహులు, జంగయ్య తదితరులు ఉన్నారు.
మిడ్జిల్ నుంచి..
మహాధర్నాకు టీఆర్ఎస్ మండల నాయకులు పెద్దఎత్తున తరలివెళ్లారు. తెలంగాణ రైతులు పండించిన ధాన్యం కొనుగోలుపై కేంద్రం స్పష్టమైన వైఖరి తెలియజేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాండు, సుధాబాల్రెడ్డి, జంగారెడ్డి, సుదర్శన్, ఎల్లయ్యయాదవ్, ప్రతాప్రెడ్డి, నారాయణరెడ్డి, శ్రీనివాసులు, నిరంజన్, భీంరాజు, బంగారు పాల్గొన్నారు.
బాలానగర్ నుంచి..
యాసంగిలో వడ్ల కొనుగోలుపై కేంద్రం స్పష్టమైన వైఖరి తెలియజేయాలని డిమాండ్ చేస్తూ ఇందిరాపార్కులో చేపట్టిన ధర్నాకు మండలంలోని టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు భారీగా తరలివెళ్లారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి వాల్యానాయక్, మండల ప్రధాన కార్యదర్శి చెన్నారెడ్డి, యూత్వింగ్ మండల అధ్యక్షుడు సుప్ప ప్రకాశ్, ఏఎంసీ డైరెక్టర్ మల్లేశ్, వైస్ఎంపీపీ వెంకటాచారి, సర్పంచులు గోపీనాయక్, రమేశ్నాయక్, రమేశ్, శంకర్, నాయకులు బిచ్చూనాయక్, కృష్ణ, భూపాల్, రవికుమార్, మనోహరాచారి, బాసూనాయక్ పాల్గొన్నారు.
మహబూబ్నగర్ మండలం నుంచి..
మహాధర్నాకు మహబూబ్నగర్ మండలం టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు భారీగా తరలివెళ్లారు. కోటకదిర గ్రామం నుంచి రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు దేవేందర్రెడ్డి, కోడూర్ సర్పంచ్ శ్రీకాంత్గౌడ్, ఎండీ మస్తాన్ తదితరులు బయలుదేరి వెళ్లారు.