పాలమూరు, అక్టోబర్ 3 : పండుగలు జాతి ఐక్యతకు దోహదపడుతాయని ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నా రు. జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ అతిథిగృహంలో దసరా ఉ త్సవ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఏ దేశంలో లేనన్ని పండుగలు హిందూ సంప్రదాయంలో ఉన్నాయన్నారు. గణేశ్ ఉత్సవ కమిటీ తిలక్ ఆధ్వర్యంలో నిర్వహించిన గణేశ్ ఉత్సవా లు స్వాతంత్య్ర పోరాటంలో జాతి ఐక్యతకు తోడ్పాటు అందించాయని తెలిపారు. తెలంగాణ ఏర్పాటులో బతుకమ్మ పండుగ కూడా అదేస్థాయిలో ముఖ్యపాత్ర పోషించిందని గుర్తుచేశారు.
జిల్లా కేంద్రంలో దసరా ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా ప్రజలకు బతుకమ్మ, దసరాపండుగ శుభాకాంక్షలు తెలిపారు. సమావేశం లో మున్సిపల్ చైర్మన్ కేసి నర్సింహులు, ముడా చైర్మన్ గంజి వెంకన్న, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్యాదవ్, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్గౌడ్, దసరా ఉత్సవ కమిటీ అధ్యక్షుడు మురళీధర్రావు, ధ్వజధారి చంద్రకుమార్, మున్సిపల్ వైస్చైర్మన్ గణేశ్, మున్సిపల్ మాజీ చైర్మన్ ముత్యాల ప్రకాశ్, మాజీ వైస్చైర్మన్ రాములు, లక్ష్మ ణ్, రామాంజనేయులు, మాల్యాద్రి, నా యకులు తదితరులు పాల్గొన్నారు.
మహబూబ్నగర్ మండలం కోడూరు లో టీఆర్ఎస్ గ్రామ నాయకుడు దాసు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వడ్డె శ్రీనివాసులు, వెంకటస్వామి, విజయ్తోపాటు మరో 20మంది మంత్రి శ్రీ నివాస్గౌడ్ సమక్షంలో టీఆర్ఎస్లో చే రారు. చేరిన వారికి గులాబీ కండువా క ప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్ర మంలో నాయకులు పాల్గొన్నారు.