ధన్వాడ, అక్టోబర్ 3 : సీఎం కేసీఆర్కు అభివృద్ధి, సంక్షే మమే లక్ష్యమని ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి అన్నారు. మండలంలోని ఓ ఫంక్షన్ హాల్లో ధన్వాడ, కిష్టాపూర్, గో టూర్, కొండాపూర్ తదితర గ్రామాలకు చెందిన 70 మం ది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు, 90 మంది లబ్ధిదారులకు నూతనంగా మంజూరైన ఆసరా పింఛన్ ప్రొసీడింగ్ గుర్తింపు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలోనే తెలంగాణ ను రోల్ మోడల్గా తీసుకోవచ్చునని, ఎందుకంటే అభివృ ద్ధి, సంక్షేమం ఒకే క్రమంలో తీసుకెళ్లే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది తెలంగాణ రాష్ర్టమేనని పేర్కొన్నారు. నారాయణపేట నియోజకవర్గంలోనే ఇప్పటి వరకు 8,680 కు టుంబాలకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అం దజేశామన్నారు. అతి త్వరలోనే దళితబంధు రెండో విడుత కూడా ప్రారంభిస్తామన్నారు. అనంతరం దళితబంధు నుం చి మంజూరైన 10 ట్రాక్టర్లను ఎమ్మెల్యే లబ్ధిదారులకు పంపి ణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచులు, ఎంపీటీసీలు, నా యకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
దామరగిద్ద, అక్టోబర్ 3 : మండలంలోని రైతువేదికలో సోమవారం ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి కల్యాణలక్ష్మి, షా దీముబారక్, సీఎం సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. 136 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు, ఐదుగురికి సీఎం సహాయ నిధి చెక్కులను పం పిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ నర్సప్ప, వైస్ఎంపీపీ దామోదర్రెడ్డి, పీఏసీసీఎస్ చైర్మన్ ఈదప్ప, ఎంపీటీసీ కిషన్రావు, సర్పంచ్ ఆశమ్మ, నాయకులు పాల్గొన్నారు.