బాలానగర్, అక్టోబర్ 1 : గిరిజనుల అ భ్యున్నతికి ముఖ్యమంత్రి కేసీఆర్ 10శాతం రిజర్వేషన్లు కల్పించి గిరిజన బాంధవుడిగా నిలిచారని కార్పొరేషన్ చైర్మన్ రామావత్ వాల్యానాయక్ అన్నారు. గిరిజనుల రిజర్వేషన్లను 6నుంచి 10శాతానికి పెంచు తూ ప్రభుత్వం జీవో జారీ చేయడంపై శనివారం మండలకేంద్రంలో సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మం డల వర్కింగ్ ప్రెసిడెంట్ బాలూనాయక్, అధికార ప్రతినిధి అరుణ్కుమార్, ఎస్టీసెల్ ఉపాధ్యక్షుడు రమేశ్నాయక్, సర్పంచులు గోపీనాయక్, రమేశ్నాయక్, రవినాయక్, నాయకులు బిచ్చూనాయక్, వెంకట్నాయ క్, జగన్నాయక్, శ్రీనివాస్, శ్రీనూనాయక్ తదితరులు పాల్గొన్నారు.
జడ్చర్ల పట్టణంలో..
గిరిజనులకు 10శాతం రిజర్వేషన్లు పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేయడంపై జడ్చర్లలోని అంబేద్కర్ చౌరస్తాలో గిరిజనులు సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్చైర్మన్ యాదయ్య, టీఆర్ఎస్ ఎస్టీసెల్ నాయకులు శ్రీను, శంకర్నాయక్, రవినాయక్, కౌన్సిలర్లు చైతన్యచౌహాన్, ప్రశాంత్రెడ్డి, సర్పంచ్ రాములూనాయక్, దీపక్నాయక్, ఉపసర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు పాండూనాయక్, గోవింద్నాయక్, నార్యానాయక్, ముడా డైరెక్టర్ ఇంతియాజ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ శ్రీకాంత్రెడ్డి, గిరియాదవ్ పాల్గొన్నారు.
మిడ్జిల్ మండలంలో..
గిరిజనుల రిజర్వేషన్లు 10శాతానికి పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేయడంపై గిరిజన ఐక్యవేదిక నాయకులు విజయ్నాయక్, భాస్కర్నాయ క్ హర్షం వ్యక్తం చేశారు. మండలకేంద్రంలో సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో రమేశ్నాయక్, తిరుపతినాయక్, శ్రీనూనాయక్, శ్రీనివాస్, దుదియానాయక్, దేవులానాయక్, రాంచరణ్, అరుణ్నాయక్ పాల్గొన్నారు.
అడ్డాకుల మండలంలో..
గిరిజనుల రిజర్వేషన్ల పెంపును హర్షిస్తూ అడ్డాకులలో సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో గిరిజన నా యకులు బాలరాజు, శెట్టినాయక్, రాజీవ్గాంధీ, వెంకటేశ్, ఎంపీటీసీ గణేశ్, కోఆప్షన్ సభ్యుడు ఖాజాగోరి, మహేశ్యాదవ్, చెన్న య్య, నర్సింహ తదితరులు పాల్గొన్నారు.
నవాబ్పేట మండలంలో..
గిరిజనులకు 10శాతం రిజర్వేషన్లు కల్పించడంపై గిరిజన నాయకులు మండలకేంద్రంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో సింగిల్విండో చైర్మన్ మాడెమోని నర్సింహులు, మార్కెట్ కమిటీ వైస్చైర్మన్ చందర్నాయక్, లింబ్యానాయక్, మాన్యానాయక్, భగవాన్, తుల్సీరాం, శంకర్, తిరుపతయ్య, రాజు, పాండు పాల్గొన్నారు.