జడ్చర్లటౌన్, సెప్టెంబర్ 30 : తెలంగాణ వచ్చిన తర్వాతే బతుకమ్మ పండుగకు ఆదరణ పెరిగిందని మహబూబ్నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. మున్సిపాలిటీలోని కావేరమ్మపేట జీపీ ఫంక్షన్హాల్లో శుక్రవారం మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రభుత్వం చీరలను పంపిణీ చేస్తున్నదని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కానుకగా ఇస్తున్న బతుకమ్మ చీరలతో ఆడబిడ్డల మోములో చిరునవ్వు కనిపిస్తున్నదన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, ఉపాధి పథకాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్చైర్మన్ యాద య్య, మున్సిపల్ చైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మి, వైస్చైర్పర్సన్ సారిక, కౌన్సిలర్లు పాహి మినాజ్, బుక్క మహేశ్, చైతన్యచౌహాన్, జ్యోతి, మహిళా సంఘాల సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
పలు వార్డుల్లో..
జడ్చర్ల మున్సిపాలిటీలోని 3, 7, 8 వార్డుల్లో శుక్రవారం మున్సిపల్ చైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మి బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్ర తిఒక్కరూ పండుగను సంతోషంగా జరుపుకోవాలన్న ఉద్దేశంతో బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమం లో కౌన్సిలర్లు సతీశ్, ఉమాదేవి, మున్సిపల్ సిబ్బంది కృష్ణయ్య, కిశోర్ పాల్గొన్నారు.
మిడ్జిల్ మండలంలో..
మిడ్జిల్, సెప్టెంబర్ 30 : మండలంలోని బోయిన్పల్లిలో సర్పంచ్ నారాయణరెడ్డి మ హిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అర్హులైన ప్రతిఒక్కరికీ బతుకమ్మ చీరను అందిస్తామ ని తెలిపారు.
గండీడ్ మండలంలో..
గండీడ్, సెప్టెంబర్ 30 : మండలంలోని పెద్దవార్వల్లో శుక్రవారం సర్పంచ్ లలితాచెన్నారెడ్డి, వైస్ఎంపీపీ ఈశ్వరయ్యగౌడ్ బ తుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దసరా సందర్భంగా ప్రభుత్వం మహిళలకు బతుకమ్మ చీరలను అందిస్తున్నదని తెలిపారు. అన్నివర్గాల సం క్షేమానికి పథకాలను అమలు చేస్తున్న ఘ నత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కిందని తెలిపారు. కార్యక్రమంలో మహిళా సంఘం అధ్యక్షురాలు మంజుల, వీబీకే సుజాత, అంజిలయ్యగౌడ్, వెంకటయ్య ఉన్నారు.
నవాబ్పేట మండలంలో..
నవాబ్పేట, సెప్టెంబర్ 30 : మండలకేంద్రంతోపాటు కిషన్గూడలో శుక్రవారం ఎంపీపీ అనంతయ్య బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సింగిల్విం డో చైర్మన్ మాడెమోని నర్సింహులు, ము డా డైరెక్టర్ గండు చెన్నయ్య, సర్పంచులు గోపాల్గౌడ్, నిర్మలమ్మ, మార్కెట్ కమిటీ డైరెక్టర్ చెన్నయ్య, మాజీ ఎంపీపీ శీనయ్య, యూత్వింగ్ మండల అధ్యక్షులు మెండె శ్రీను, నర్సింహులు, నరేశ్ పాల్గొన్నారు.
రాజాపూర్ మండలంలో..
రాజాపూర్, సెప్టెంబర్ 30 : మండలంలోని రాయపల్లిలో శుక్రవారం సర్పంచ్ గంగాధర్గౌడ్ బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ లక్ష్మ య్య, పంచాయతీ కార్యదర్శి రవిప్రకాశ్, నర్సింహులు, భాస్కర్, మాధవారెడ్డి, ఉదేశ్గౌడ్, మల్లేశ్గౌడ్ పాల్గొన్నారు.