కల్వకుర్తి రూరల్, సెప్టెంబర్ 29 : నిత్యం పౌష్టికాహారం తీసుకోవడం ద్వారానే ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటారని పౌష్టికాహారంపై ప్రజలకు మరింత అవగాహన కల్పించి రోగ రహిత తెలంగాణగా తీర్చుదిద్దామని ఎమ్మెల్యే జైపాల్యాదవ్లు, డీడబ్ల్యూవో వెంకటలక్ష్మి అన్నారు. పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలోని ద్యాప గోపాల్రెడ్డి సమావేశ మందిరంలోఎంపీపీ సామమనోహర అధ్యక్షతన కల్వకుర్తి అంగన్వాడీ, వైద్య శాఖల ఆధ్వర్యంలో పోషణ అభియాన్ మాసం, వయోవృద్ధుల హక్కులపై గురువారం అవగాహన సమావేశం నిర్వహించారు, ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పుట్టిన శిశువు నుంచి వయోవృద్ధుల వరకు పలు విధాలుగా సేవలందిస్తూ అంగన్వాడీ టీచర్లు ఆత్మీయులుగా తోబుట్టువులుగా పేరును పొందుతున్నారన్నారు.
కనిపించే ప్రత్యక్ష దైవాలు తల్లిదండ్రులేనని వారిని హింసించడం, బాధించడం అనాగరికమని వారిని గౌరవిస్తూ చేరదీయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వయోవృద్ధులకు చేయూతగా పింఛన్ను అందిస్తోందన్నారు. అనంతరం డీడబ్ల్యూవో మాట్లాడుతూ వయోవృద్ధులు, దివ్యాంగులు తమ హక్కులను తెలుసుకొని వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వయోవృద్ధులను సరిగా చూసుకోకపోయినా వారిని బాధపెట్టినా వారు అంగన్వాడీ టీచర్లను గానీ హెల్ప్లైన్14567 సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఎడ్మసత్యం, మాజీ చైర్మన్ శ్రీశైలం, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు విజయ్గౌడ్, ఏఎంసీ మాజీ చైర్మన్ బాలయ్య, కోఆప్షన్ సభ్యుడు రుక్నుద్దీన్, ఇన్చార్జి ఎంపీడీవో ఆంజనేయులు, ఐసీడీఎస్ సూపర్వైజర్ పద్మావతి ఉన్నారు.
కల్వకుర్తి, సెప్టెంబర్ 29 : దసరా పండుగను సుఖ సంతోషాలతో జరుపుకోవాలని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ పిలుపునిచ్చారు. దసరా పండుగను పురస్కరించుకుని మున్సిపాలిటీ సమకూర్చిన నిత్యావసర సరుకులు, దుస్తులను గురువారం మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యంతో కలిసి ఎమ్మెల్యే జైపాల్యాదవ్ మున్సిపల్ కార్మికులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎక్కడా లేని విధంగా కల్వకుర్తి మున్సిపాలిటీలో మున్సిపల్ సిబ్బందికి పండుగ సందర్భంగా దుస్తులు, నిత్యావసర సరుకులు పంపిణీ చేయడాన్ని అభినందిస్తున్నానని ఎమ్మెల్యే అన్నారు.
మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం మాట్లాడుతూ కార్మికుల ప్రతి ఏడాది పారిశుధ్య సిబ్బందికి సేప్టీ మేజర్స్, రేడియం, ఆప్రాన్స్, టవల్, చీరలు, జత బట్టలు, రగ్గులు, సబ్బులు, నూనె, పప్పు,చెప్పులు, బూట్లు తదితర వస్తువులు పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీశైలం, కౌన్సిలర్లు బాలు, యాదమ్మ, సూర్యప్రకాశ్రావు, రవీందర్, శ్రీనివాస్, గోపిరెడ్డి లక్ష్మి, షాహీన్, చైతన్య, రజియా బేగం, ఎజాస్, చందన, పద్మ, సైదులు గౌడ్, భోజిరెడ్డి, మనోహర్రెడ్డి, జానకమ్మ, ఖలీల్, అజ్మత్ బేగం, ఇన్చాక్జి కమిషనర్ రాజకుమారి తదితరులు పాల్గొన్నారు.
కల్వకుర్తి, సెప్టెంబర్ 29 : మున్సిపల్ పాలకమండలి సమన్వయంతో ముందుకు సాగుతూ అభివృద్ధిలో మున్సిపాలిటీని ముందంజలో నిలపాలని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ పిలుపునిచ్చారు. మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం అధ్యక్షతన మున్సిపల్ పాలకమండలి సమావేశాన్ని గురువారం నిర్వహించారు. సమావేశంలో పలువురు కౌన్సిలర్లు కాలనీల్లో చేపడుతున్న అభివృద్ధి పనులు, సమస్యల ను వివరించారు. 13వ వార్డు కౌన్సిలర్ సౌజన్యారెడ్డి మాట్లాడుతూ కల్వకుర్తిలో నిర్మించిన ఎన్హెచ్ రోడ్డు కాలనీలకు వెళ్లే రోడ్ల కంటే ఎత్తుగా నిర్మించడంతో, ఎన్హెచ్ నుంచి కాలనీకు వెళ్లడానికి ఇబ్బందిగా మారిందన్నారు.
ఎన్హెచ్ రోడ్డు నుంచి కాలనీలకు వెళ్లే రోడ్డును కలుపుతూ ర్యాంపు వేయాల్సిన కాంట్రాక్టర్ నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అదే విధంగా మిషన్ భగీరథ పనులు అస్తవ్యస్తంగా చేస్తున్నారని, సరిగ్గా చేయాలని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకు వినతిపత్రం ఇచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.