నాగర్కర్నూల్, సెప్టెంబర్ 29 : నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఉయ్యాలవాడ సమీపంలో ని ర్మాణంలో ఉన్న మెడికల కళాశాల పనులను నిలి పి వేయాలన్న హైకోర్టు ఆదేశాలు తొలగిపోయా యి. ఈమేరకు మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీల నిర్మాణానికి హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కళాశాల నిర్మాణం కోసం రైతుల నుంచి భూములు తీసుకొని కనీస పరిహారం ఇవ్వడం లేదంటూ ఇటీవల ఉయ్యాలవాడకు చెందిన మధు అనే రైతు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.. కాగా మెడికల్ కళాళాల ప నులు ఆపి వేయాలని సింగిల్ బెంచ్ జడ్జి తీర్పు ఇచ్చారు. దీనిపై ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్పై వాదనలు విన్న ధర్మాసనం స్టే ఎత్తివేస్తూ నిర్మాణ పనులు చేపట్టాలని సూచించింది. నిర్మా ణ పనులకు ఇక నుంచి ఎలాంటి ఆటంకం కలిగించొద్దని ఉత్తర్వులు జారీ చేయడంతో పనులు కొనసాగుతున్నాయి.