వనపర్తి, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలోని ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యంలో అన్ని వర్గాలకు సంక్షేమ ఫలితాలు అందుతున్నాయని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. స్వా తంత్య్రం వచ్చిన నాటి నుంచి రైతు కోసం ఆలోచించిన ప్రభుత్వమే లేదని, కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు వెన్నుదన్నుగా నిలిచి సాగును లాభసాటిగా మా ర్చిందన్నారు. బుధవారం వనపర్తి జిల్లాలోని వనపర్తి, గోపాల్పేట, ఖిల్లాఘణపురం మండలాల్లో మంత్రి ప ర్యటించి కొత్తగా మంజూరైన పింఛన్లు, బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు.
అలాగే పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. అంతకుముందు వనపర్తి మండలం కాశీంనగర్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మహాజన సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ సహకార వ్యవస్థను రాష్ట్రంలో పటిష్టం చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని అన్నారు. ధాన్యం కొనుగోళ్లు సహకార సంఘాలకు అప్పగించిన తర్వాత ఆర్థికంగా బలపడ్డాయని తెలిపారు. కొనుగోళ్ల ద్వారా వచ్చిన కమీషన్లతో సహకార సంఘాలు పరిపుష్టి అ య్యాయన్నారు. సహకార సంఘం అంటే రైతులకు అప్పులు ఇచ్చేది కాదని, రైతులను అప్పుల పాలుకాకుండా కాపాడబడేదని అన్నారు.
సహకార రంగం అ ప్పులు ఇవ్వడానికి ఏర్పాటు చేయబడిందన్నట్లు మార్చేశారన్నారు. రైతుల గుండెల్లో ఉన్న ఆలోచనను కేవలం కేసీఆర్ ఒక్కరే గుర్తించారని అభిప్రాయపడ్డారు. దేశం లో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో రైతు ఇంటి తలుపుతట్టి రైతుబంధు అందజేస్తున్నామని తెలిపారు. కేసీఆర్ అమలు చేస్తున్న వ్యవసాయ అనుకూల, సంక్షేమ పథకాల గురించి దేశంలో మిగతా రాష్ట్రాల ప్రజలు విని బాగున్నాయని ప్రశంసలు గుప్పిస్తున్నారని చెప్పారు. ఈ విషయాన్ని ఢిల్లీ వేదికగా వివరిస్తే వివిధ రాష్ర్టాల ప్రతినిధులు నిజమా? అంటూ నోరెళ్ల బెట్టాయన్నారు.
రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేస్తామని, ఇప్పటికే కొందరికి చేశామని, మిగతా వారికి త్వరలో పూర్తిస్థాయి రుణమాఫీ అందుతుందన్నారు. రైతులు సంప్రదాయ పంటల సాగు నుంచి రైతులు బయట పడాలని సూచించారు. తెలంగాణలో 50 లక్ష ల మందికి ఆసరా పింఛన్లు అందిస్తున్నట్లు తెలిపారు. రైతుల కోసం రైతుబంధు, రైతుబీమా, ఉచిత కరెంట్ అందిస్తున్నామని అన్నారు. పేదలు ఆర్థికాభివృద్ధి సా ధించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. మంత్రిగా, ఎ మ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి పుట్టిన ఊరులో కనీసం డ్రైనేజీ కట్టించలేకపోయాడని చిన్నారెడ్డిని ఉద్దేశించి మంత్రి విమర్శించారు.
రైతుబంధు పనికిరానిదని విమర్శించి తన భూమికి ఏటా రైతుబంధు తీసుకుంటున్నాడని ధ్వ జమెత్తారు. అనంతరం గోపాలపేటలోని చెన్నకేశవస్వా మి ఆలయాన్ని మంత్రి దర్శించుకున్నారు. చాకల్పల్లి లో రూ.5 లక్షల సీడీఎఫ్ నిధులతో నిర్మించిన ఎస్సీ క మ్యూనిటీ భవనాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ లోక్నాథ్రెడ్డి, ఎంపీపీలు కిచ్చారెడ్డి, అడ్డాకుల సంధ్య, పంచాయతీరాజ్ ఈఈ మల్లయ్య, డీసీవో కాం తి, జెడ్పీటీసీ మంద భార్గవి, ప్రాథమిక సహకార సం ఘం అధ్యక్షుడు మధుసూదన్రెడ్డి, సింగిల్ విండో అధ్యక్షుడు వెంకట్రావు, విండో వైస్ చైర్మన్ గువ్వల రాము లు, టీఆర్ఎస్ వనపర్తి పట్టణ అధ్యక్షుడు రమేశ్గౌడ్, రైతుబంధు మండల అధ్యక్షులు నర్సింహ, తిరుపతి యాదవ్, వనపర్తి, గోపాల్పేట మండల అధ్యక్షుడు మా ణిక్యం, కోదండం, వనపర్తి మండల అధ్యక్షుడు రాము, ప్రధాన కార్యదర్శి గణేశ్ తదితరులు పాల్గొన్నారు.