దేవరకద్ర రూరల్, సెప్టెంబర్ 29: పేద ప్రజల కష్టాలు గుర్తించి వారి అభివృద్ధిని కోరుకునే దేవుడులాంటి వ్యకిత కేసీఆర్ అని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. గురువారం దేవరకద్ర మండలంలోని వెంకటాయపల్లి, గద్దెగూడెం, అజిలాపూర్, చిన్న రాజమూరు గ్రామాల్లోని లబ్ధిదారులకు కొత్త ఆసరా పింఛన్ కార్డులు, బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. 2014కు మందు నియోజకవర్గంలో 3,755 మందికి మాత్రమే పింఛన్లు ఇచ్చేవారని, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత 6,234 మందికి ఇస్తున్నామన్నారు. ఇప్పటికీ 11వేల మందికి కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. అన్ని సామాజిక వర్గాలకు, కుల వృత్తుల ఆర్థిక అభ్యున్నతికి అనేక సంక్షేమ పథకాలు రూపొందించారన్నారు.
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నందుకే ఇన్ని సంక్షేమ ఫలాలు అమలు చేస్తున్నారని తెలిపారు. కేసీఆర్కు ఎల్లప్పుడూ రుణపడి ఉండాలన్నారు. దేవరకద్ర మండలం వెంకటాయపల్లి గ్రామానికి చెందిన గొల్ల రమేశ్ ప్రమాదవశాత్తు మృతి చెందగా ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటంబ సభ్యులను పరామర్శించి, ఆర్థిక సాయం చేశారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామన్నారు. ఎమ్మెల్యే వెంట ఎంపీపీ రమాదేవి, సర్పంచ్ ఆంజనేయులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ రమాదేవి, సర్పంచులు ఆంజనేయులు, హేమలత, విశ్వనాథ్, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు కొండారెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు జెట్టి నర్సింహారెడ్డి, నాయకులు శ్రీకాంత్యాదవ్, శ్రీనివాస్రెడ్డి, వెంకటేశ్, బాలస్వామి, వెంకట్రాములు, గురుప్రసాద్, బాలగణేశ్, సత్యంసాగర్, చల్మారెడ్డి, యుగంధర్రెడ్డి పాల్గొన్నారు.