ఊట్కూర్, సెప్టెంబర్ 29 : టీఆర్ఎస్ ప్రభుత్వ హ యాంలో గడపగడపకూ సంక్షేమ పథకాలు చేరువవుతుండడంతో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని ఎమ్మెల్యే చి ట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. మండలంలోని పులిమామి డి, ఎడవెల్లి గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొని మహిళలకు చీరలు పంపిణీ చేశా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్ర తి కుటుంబం దసరా, బతుకమ్మ పండుగలను ఆనందంగా నిర్వహించుకోవాలన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ చీరల పం పిణీకి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు.
ప్రభుత్వం అమలు చే స్తున్న ప్రతి పథకాన్ని పార్టీలకతీతంగా అందిస్తున్నామన్నా రు. అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేక బీజేపీ, కాం గ్రెస్ నాయకులు దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని మం డిపడ్డారు. ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న ప్రభుత్వానికి అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ లక్ష్మి, జెడ్పీటీసీ అశోక్కుమార్గౌడ్, వైస్ ఎంపీపీ ఎల్లాగౌడ్, మాజీ ఎంపీపీ వెంకట్రామారెడ్డి, సర్పంచులు సూరయ్యగౌడ్, శిరీష, ఐకేపీ ఏపీఎం నర్సింహులు, సీసీ భీ మయ్య, నాయకులు పాల్గొన్నారు.
లయన్స్క్లబ్ సేవలను విస్తరించి ప్రజల ఆదరాభిమానా లు పొందాలని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. మండలంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మండల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై ప్రా రంభించారు. మలక్పేట యశోద దవాఖాన వైద్య బృందం ఆధ్వర్యంలో ఏ ర్పాటు చేసిన ఈసీజీ, టూ డీ ఈకో, బీపీ, షుగర్ టెస్టు పరీక్షా కేంద్రాలను సందర్శించి వైద్య సేవలపై ఆరా తీశారు. వైద్యులు ఎమ్మెల్యే కు సైతం ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ లయన్స్ క్లబ్ సేవా కా ర్యక్రమాల్లో మండలంలోని అన్ని గ్రామాల్లో స్థానిక యు వత, ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలన్నారు.
పశు వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి పశువులు వ్యాధుల బారిన పడకుండా సంరక్షించాలని కోరారు. లయన్స్క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించే సేవా కార్యక్రమాలకు తమవంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన 300 మందికి పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేశారు. లయన్స్ క్లబ్ అధ్యక్షుడు జనార్దన్రెడ్డి ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో లయన్ క్లబ్ డిస్టిక్ట్ ఫస్ట్ వైస్ గవర్నర్ హరినారాయణ్ భట్టడ్, తాసిల్దార్ తిరుపతయ్య, స ర్పంచ్ సూర్యప్రకాశ్రెడ్డి, పీఏసీసీఎస్ చైర్మన్ బాల్రెడ్డి, మా జీ జెడ్పీటీసీ అరవింద్కుమార్, ఎంపీటీసీ హనుమంతు, లయన్స్క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.
మక్తల్ టౌన్, సెప్టెంబర్ 29 : దళితబంధు పథకం దేశానికే ఆదర్శంగా మారిందని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు పథకం నుంచి మంజూరైన ట్రాక్టర్లను గురువారం ఎమ్మెల్యే లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ రాష్ట్రంలోని దళితులందరూ అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో దళితబంధు పథకాన్ని తీసుకురావడం జరిగిందన్నారు. దళితబంధు పథకం నుంచి మంజూరైన రెండు ట్రా క్టర్లను మక్తల్ నియోజకవర్గంలోని ఊట్కూర్ మండలం నాగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు దళితులకు అందజేశారు. కార్యక్రమంలో ఏడీఏ జాన్ సుధాకర్, ఊట్కూర్ జె డ్పీటీసీ అశోక్గౌడ్, నాయకులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.