రేవల్లి, సెప్టెంబర్ 22 : వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తేనే రాష్ర్టాలు, దేశం బాగుపడుతుందని గుర్తించి సీఎం కేసీఆర్ తెలంగాణలో యుద్ధప్రాతిపదికన సాగునీటి ప్రా జెక్టులకు పూర్తి చేశారని జెడ్పీ చైర్మన్ లోకనాథ్రెడ్డి అన్నారు. గురువారం రేవల్లి మండల సర్వసభ్య సమావేశం నిర్వహించగా ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మా ట్లాడారు. అంతకు ముందు స్థానిక పాఠశాలలను పరిశీలించగా ఆవరణ మొత్తం అపరిశుభ్రంగా ఉండడం, పిచ్చిమొక్కల తో నిండిఉండడంతో ఆయన అసహనం వ్యక్తం చేశారు. పాఠశాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతిఒక్కరి సామాజిక బా ధ్యత అని దానిని కూడా ప్రభుత్వమే చేయాలని ఎదురుచూస్తే ఎలాగని ఉపాధ్యాయులను నిలదీశారు. తక్షణమే పాఠశాల ఆవరణలో మొక్కలు తొ లగించి పరిసరాలను శుభ్రం చేయించాలని పం చాయతీ అధికారులను ఆదేశించారు.
అ నంతరం ఎమ్మార్సీలో జరిగిన ఉపాధ్యాయుల కాంప్లెక్స్ సమావేశంలో పాల్గొని ఉపాధ్యాయుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సర్వసభ్య సమావేశానికి హాజరై సభ్యులు లేవనెత్తిన సమస్యలపై మాట్లాడారు. ముఖ్యంగా రైతులు సంప్రదాయ వ్యవసాయాన్ని వీడి ఆధునిక పద్ధతుల్లో సాగు చేయాలని, ఉత్సాహవంతులైన యువ రైతులను ప్రొత్సహించడం వల్ల రైతాంగానికి నూతన వ్యవసా య విధానాన్ని అందించవచ్చని సూచించారు. ఆర్అండ్ఆర్ సెంటర్లు బండరాయిపాకుల, కొంకలపల్లి గ్రామా ల్లో ప్రజలు ఇండ్లు కట్టుకోవడానికి నీరులేక ఇ బ్బందులు ఎదుర్కొంటున్నారని ట్యాంక ర్ల ద్వారా నీటిని కొనుగోలు చేసి కట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని సర్పంచులు సమావేశం దృష్టికి తీసుకురాగా రష్యా దేశం పైప్లైన్ ద్వారా దేశం ఎల్లలుదాటి యూరప్ దేశాలకు గ్యాస్ను సరఫరా చేస్తున్నదని, మన మిషన్ భగీరథ అధికారులు గ్రామాలకే తాగునీటిని సరఫరా చేయలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
తక్షణమే ఆ గ్రామాలకు నీటి సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం వివిధ సమస్యలపై ఆయన మాట్లాడుతూ అధికారులు గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో ఎంపీపీ బంకళ సే నాపతి, జెడ్పీటీసీ భీమయ్య, సింగిల్ విండో చైర్మన్ రఘుయాదవ్, వైస్ఎంపీపీ మధుసూదన్రెడ్డి, మార్కెట్ కమిటీ స భ్యుడు సురేశ్, ఎంపీడీవో నర్సింహ తో పాటు సర్పంచులు, ఎంపీటీసీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.