రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండుగకు కొత్త బట్టలను సారెగా పెడుతూ ఆడపడుచులకు సర్కార్ కానుక అందిస్తున్నది. ఉమ్మడి జిల్లాలో బతుకమ్మ చీరల పంపిణీకి అధికార యంత్రాంగం సిద్ధమైంది. రేషన్ దుకాణాల నుంచి అర్హులైన మహిళలందరికీ రంగురంగుల చీరలను అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏడాది ఆరు రంగులు..32డిజైన్లలో తయారు చేయడంతో మహిళాలోకం హర్షం వ్యక్తం చేస్తున్నది.
నాగర్కర్నూల్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ)/గద్వాల : సమైక్య పాలనలో అస్తిత్వం కోల్పోయిన బతుకమ్మ పండుగకు తెలంగాణ ప్రభుత్వం గుర్తింపునిచ్చింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతి ఏటా అధికారికంగా నిర్వహిస్తున్నది. నిధులను సైతం విడుదల చేస్తున్నది. ముఖ్యంగా 18 ఏండ్లు నిండిన ఆడపడుచులకు సర్కార్ కానుకగా చీరలను పంపిణీ చేస్తున్నది. రేషన్ కార్డుల్లో పేర్లు ఉన్న అర్హులైన మహిళలందరికీ తీరొక్క చీరలను అందజేస్తుండడం విశేషం.
ఈ పథకం ద్వారా చేనేత కార్మికులకు చేతి నిండా పని దొరుకుతున్నది. విభిన్న రంగుల్లో బంగారు, వెండి జరీ అంచులతో తయారు చేస్తుండడం గమనార్హం. 32 రకాల డిజైన్లలో ఉన్న చీరలు జిల్లాలకు చేరుకోగా, పంపిణీ చేసేందుకు రేషన్ దుకాణాలకు కూడా చేరవేశారు. నాగర్కర్నూల్ జిల్లాలో 2,99,012 మందిని అర్హులుగా గుర్తించగా, ఇప్పటివరకు 2,25,000 చీరలు జిల్లాకు వచ్చాయి. మున్సిపల్, మెప్మా, మహిళా సంఘాల అధికారులు పర్యవేక్షించనున్నారు. జిల్లాలోని 558 రేషన్ దుకాణాల ద్వారా ఎమ్మెల్యేలు, ఎంపీ, ఎమ్మెల్సీలు, కలెక్టర్ చేతుల మీదుగా బుధవారం నుంచి పంపిణీ చేయనున్నట్లు సివిల్ సైప్లె జిల్లా అధికారి మోహన్బాబు తెలిపారు.
జోగుళాంబ గద్వాల జిల్లాలో పౌరసరఫరాలు, చే నేత, రెవెన్యూ శాఖల సమన్వయంతో రూపొందించారు. 2,14,000 మందిని అర్హులుగా గుర్తించారు. జిల్లాకు చేరుకున్న చీరలను మల్దకల్ మండలం కుర్తి రావులచెర్వు గ్రామ సమీపంలోని గో దాంలో భద్రపర్చగా, అక్కడి నుంచి సోమవారం ఆ యా మండల కేంద్రాలకు తరలించారు. మంగళవా రం జిల్లా కేంద్రంలోని 21, 22 వార్డుల్లో ఎమ్మెల్యే చే తుల మీదుగా చీరల పంపిణీకి చర్యలు తీసుకుంటున్న ట్లు చేనేత, జౌళి శాఖ అధికారి గోవిందయ్య తెలిపారు.