మద్దూర్/ కోస్గి, సెప్టెంబర్ 19 : మద్దూర్ మండలకేంద్రంలోని ప్రధాన చౌరస్తా, పట్టణంలోని స్థానిక శివాజీ చౌరస్తాలో సోమవారం సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి చిత్రపటాలకు టీఆర్ఎస్ నాయకులు క్షీరాభిషేకం చేశారు. గిరిజనులకు రిజర్వేషన్లను 10శాతానికి పెంచుతున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించడంతో నాయకులు, గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వారంలోగా జీవో జారీ చేస్తామని చెప్పడంతో వారి ఆనందానికి అవధులు లేవు. దళితబం ధు తరహాలోనే గిరిజనబంధు అమలు చేస్తామని సీఎం ప్రకటించారు. అన్ని వర్గాల అభివృద్ధి లక్ష్యంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హ యాంలో తండాలు అన్ని విధాలా అభివృద్ధి చెందడంతోపాటు గిరిజనుల ఆత్మగౌరవం మరింత పెరిగిందన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు హనుమంత్రెడ్డి, జెడ్పీటీసీ ప్రకాశ్రెడ్డి, పీఏసీసీఎస్ చైర్మన్ భీంరెడ్డి, కౌ న్సిలర్లు, కో ఆప్షన్ సభ్యుడు ఓంప్రకాశ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
హన్వాడ, సెప్టెంబర్ 19 : గిరిజనులకు సంక్షేమం కోసం కృషి చేస్తున్న సీఎం కేసీఆర్, మంత్రి శ్రీనివాస్గౌడ్ చిత్రపటాలకు సోమవారం ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో క్షీరాభిషేకం చే శారు. ఎల్లప్పుడూ ప్రభుత్వానికి అండగా ఉంటామన్నారు. కార్యక్రమంలో ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు హరిశ్చంద్ర, గిరిజన సంఘం నాయకులు ఉన్నారు.