పాలమూరు, సెప్టెంబర్ 18: మహబూబ్నగర్లో ఈసా రి దసరా ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించుకుందామని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, యువజన స ర్వీసులు, పర్యాటక, పురావస్తు శాఖ మంత్రి డా.వి.శ్రీనివాస్గౌడ్ అన్నారు. మహబూబ్నగర్ బ్రాహ్మణవాడి, ఆర్య సమాజ్ మందిరంలో ఆదివారం ఏర్పాటు చేసిన దసరా ఉత్సవ కమిటీ సమావేశానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. దసరా ఉత్సవాల నిర్వహణపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. పట్టణంలో దసరా ఉత్సవాలను తొలిసారిగా ప్రారంభించిన స హదేవ్ యాదవ్ను ఎప్పటికీ మార్చిపోమన్నారు. అదే స్ఫూ ర్తితో ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుందామన్నారు. ఆధ్యాత్మికపరంగా అవసరమైన అన్ని కార్యక్రమాలకు ప్ర భుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు ఉంటాయన్నారు. పట్టణంలో అ త్యంత ఖరీదైన ప్రాంతంలో గణేశ్ భవన నిర్మాణం కోసం రూ.కోటికి పైగా విలువైన స్థలం ఇవ్వడమే కా కుండా ఇప్పటికే రూ.35లక్షలు ఖ ర్చు చేసి పనులు ప్రారంభించామన్నారు. వినాయక ఉత్సవాల కోసం కాకుండా ఆధ్యాత్మి క కార్యక్రమాల కు అనువుగా భవనాన్ని తీర్చిదిద్దామని ఆయన చెప్పారు.
రూ.15 కోట్లతో 7 ఎకరాల్లో నిర్మిస్తున్న శిల్పారామం నిర్మాణం పూర్తైన తర్వాత అక్కడ దస రా వేదిక ఏర్పాటు చేస్తున్నామన్నారు. శిల్పారామంలో సం ప్రదాయబద్ధంగా ఏర్పాట్లు ఉంటాయన్నారు. పండుగల స మయంలో సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు వేదిక గా ఏర్పాట్లు ఉండబోతున్నాయన్నారు. నెక్లెస్ రోడ్డు, ఐ ల్యాండ్, మినీ ట్యాంక్ బండ్ పనులు పూర్తైన తర్వాత అ ద్భుతమైన ప్రదేశంగా మారుతుందన్నారు. పాత కలెక్టరేట్ వద్ద సూపర్ స్పెషాలిటీ దవాఖాన ఏర్పాటు చేస్తున్నామని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్గౌడ్, ముడా చైర్మ న్ గంజి వెంకన్న, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, రై తుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్ యాదవ్, గొర్రె ల పెంపకం దారుల సహకార సంఘం జిల్లా అధ్యక్షుడు శాంతయ్య యాదవ్, వైస్ చైర్మన్ గణేశ్, ముడా డైరెక్టర్ ఆం జనేయులు, వెంకటేశ్గౌడ్, దసరా ఉత్సవ కమిటీ అధ్యక్షు డు మురళీధర్, ప్రధానకార్యదర్శి ముత్యాల ప్రకాశ్, నాయకులు కేఎస్ రవికుమార్, చెరుకుపల్లి రాజేశ్వర్, శివరాజ్, గౌలివీరు, సత్యంయాదవ్, మాల్యాద్రిరెడ్డి, కౌన్సిలర్లు, నా యకులు తదితరులు పాల్గొన్నారు.