జడ్చర్ల/జడ్చర్లటౌన్, సెప్టెంబర్ 16 : రాష్ట్రంలో అన్నివర్గాల సంక్షేమానికి పథకాలను అమలు చేస్తున్నట్లు మహబూబ్నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి చెప్పారు. తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా శుక్రవారం జడ్చర్లలోని వ్యవసాయ మార్కెట్యార్డు నుంచి బాదేపల్లి జెడ్పీ హైస్కూల్ వరకు నిర్వహించిన భారీ ర్యాలీలో ఎంపీ, ఎమ్మెల్యేతోపాటు ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాదేపల్లి హైస్కూ ల్ మైదానంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో ప్రత్యేక తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్నామన్నారు. రాష్ట్రంలోని వివి ధ రంగాలను అభివృద్ధి చేయడంతోపాటు పేద విద్యార్థుల చదువుకు సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. రాష్ర్టాభివృద్ధి, కుల, మతరహిత సమాజ నిర్మాణమే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతుబంధు, రైతుబీమా, దళితబంధు వంటి సంక్షేమ పథకాలతోపాటు ప్రా జెక్టులు, రోడ్ల నిర్మాణాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఆసరా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి పథకాలు పేదలకు అండగా ని లుస్తున్నాయన్నారు.
పేద విద్యార్థులు ఉన్న త ప్రమాణాలతో చదువుకునేలా గురుకులాలను ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్ర సచివాలయానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టడం గొప్ప నిర్ణయమని, ఇందుకు జడ్చర్ల నియోజకవర్గ ప్రజల తరఫున ము ఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు తెలియజేశారు. పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని అసెంబ్లీలో తీర్మాణం చేసిన ట్లు చెప్పారు. రాష్ర్టాన్ని అన్నివిధాలా అభివృ ద్ధి దిశగా తీసుకెళ్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో కీలకపాత్ర పోషించాల్సిన అవస రం ఉందని తెలిపారు. కాగా, తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగం గా నిర్వహించిన భారీ ర్యాలీలో దాదాపు 15వేల మంది పాల్గొన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, విద్యార్థులు జాతీయ జెండాలను చేతబూని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పట్టణానికి చెందిన ఆగీర్ కుమారస్వామి ఆధ్వర్యంలో విద్యార్థులకు జ్యూస్ బాటిళ్లను అందజేశారు. అదేవిధంగా ర్యాలీలో పాల్గొన్న ప్రతిఒక్కరికీ భోజ న వసతి ఏర్పాటు చేశారు. పట్టణంలో ట్రా ఫిక్ ఇబ్బందులు ఏర్పడకుండా సీఐలు రమేశ్బాబు, జములప్ప ఆధ్వర్యంలో పోలీ సు బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమం లో గిరిజన కార్పొరేషన్ చైర్మన్ వాల్యానాయక్, జెడ్పీ వైస్చైర్మన్ యాదయ్య, డీసీఎంఎస్ చైర్మన్ ప్రభాకర్రెడ్డి, స్పెషల్ కలెక్టర్ పద్మశ్రీ, జెడ్పీ సీఈవో జ్యోతి, మున్సిపల్ చై ర్పర్సన్ లక్ష్మి, సర్పంచుల సంఘం రాష్ట్ర ప్ర ధానకార్యదర్శి ప్రణీల్చందర్, తాసిల్దార్ లక్ష్మీనారాయణ, ఎంఈవో మంజులాదేవి, కమిషనర్ మహమూద్షేక్ పాల్గొన్నారు.