అమరచింత, సెప్టెంబర్ 13 : కృష్ణమ్మ ఉరకలేస్తున్నది. ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టు గేట్ల నుం చి జూరాలకు వరద భారీగా వస్తున్నది. మంగళవారం సా యంత్రం 2.20 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదైంది. దీంతో ప్రాజెక్టు 34 గేట్లు ఎత్తి 1,63,460 క్యూసెక్కులను నదిలోకి వదిలారు. అలాగే పవర్హౌస్కు 32,552 క్యూ సెక్కులను వినియోగిస్తున్నారు. నెట్టెంపాడు లిఫ్ట్కు 750, ఎడమ కాల్వకు 820, కుడి కాల్వకు 311, సమాంతర కాల్వకు 100 క్యూసెక్కులు విడుదల చేశారు. దీంతో ప్రా జెక్టు నుంచి మొత్తంగా 1,98,037 క్యూసెక్కుల అవుట్ఫ్లో నమోదైంది. ప్రస్తుతం 7.911 టీఎంసీలు నిల్వ ఉన్నది.
శ్రీశైలం ప్రాజెక్టులో..
ఎగువ నుంచి వరద ఉధృతి కొనసాగుతుండడంతో శ్రీశైలం జలాశయం నిండుకుండ ను తలపిస్తున్నది. మంగళవారం సాయంత్రం 3,00, 847 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదైంది. దీంతో 9 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 2,51,433, కుడి, ఎడమ విద్యుదుత్పత్తి కేంద్రాలకు 62,537 క్యూసెక్కులు సాగర్ వైపు పరుగులు తీస్తున్నాయి. అలాగే మహత్మాగాంధీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, మల్యాల-హంద్రినీవా సుజలా స్రవంతి ప్రాజెక్ట్లకు ఎత్తిపోతల కొనసాగడంతో శ్రీశైలం నుంచి మొత్తం 3,23,783 క్యూసెక్కుల అవుట్ఫ్లో నమోదైంది. రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటినిల్వ 215 టీఏంసీలు కాగా, ప్రస్తుతం 213.8824 టీఏంసీలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఆర్డీఎస్కు నిలకడగా..
కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్టకు వరద నిలకడగా కొనసాగుతున్నది. మంగళవారం ఇ న్ఫ్లో 74,470, అవుట్ఫ్లో 74,000 క్యూసెక్కులుగా న మోదైంది. ప్రధాన కాల్వకు 470 క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్లు ఏఈ శ్రీనివాస్ తెలిపారు. ప్రస్తుతం ఆనకట్టలో 12 అడుగుల మేర నీటిమట్టం ఉన్నది. అలాగే తుంగభద్ర డ్యాంకు వరద వచ్చి చేరుతున్నది. ఇన్ఫ్లో 47,489, అవుట్ఫ్లో 48,024 క్యూసెక్కులు నమోదైనట్లు ఎస్ఈ శ్రీకాంత్రెడ్డి, సెక్షన్ అధికారి విశ్వనాథ్ తెలిపారు. పూర్తిస్థాయి సా మర్థ్యం 105.788 టీఎంసీలు ఉండగా.. ప్రస్తుతం 104. 062 టీఎంసీలు నిల్వ ఉండగా.. నీటిమట్టం 1633 అడుగులకుగానూ 1632.57 అడుగులకు చేరింది.