జడ్చర్లటౌన్, సెప్టెంబర్ 5 : వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా కొలువుదీరిన గణనాథుల నిమజ్జనోత్సవాన్ని సోమవారం జడ్చర్లలో ఘనంగా నిర్వహించారు. ఈ సం దర్భంగా గణనాథులకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అలంకరించిన వాహనాలపై విగ్రహాలను ఉంచి శోభాయాత్ర నిర్వహించారు. ఊరేగింపులో యువత నృత్యాలతో హోరెత్తించారు.
నేతాజీచౌరస్తా, గంజ్, గాంధీచౌరస్తా ప్రాంతాల్లో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గణనాథులకు స్వాగతం పలికారు. అనంతరం వినాయక నిమజ్జన ఏ ర్పాట్లను ఎమ్మెల్యేతోపాటు ఎస్పీ ఆర్.వెంకటేశ్వర్లు, మహబూబ్నగర్ డీఎస్పీ మహేశ్, మున్సిపల్ చైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మి, కమిషనర్ మహమూద్షేక్ పరిశీలించారు. సీఐ రమేశ్బాబు ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు నిర్వహించారు.
కోయిలకొండ, సెప్టెంబర్ 5 : మండలంలోని మోదీపూర్, కోయిలకొండ, చింతల్తండా, కానుగుబండతండా తదితర గ్రా మాల్లో గణేశ్ నిమజ్జనోత్సవాన్ని కనులపండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ ణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి నిమజ్జనానికి తరలించారు. మోదీపూర్ వెనకితండాలో గణేశ్ నిమజ్జనం సందర్భంగా గిరిజనులు చేసిన నృత్యం అలరించింది.
భూత్పూర్, సెప్టెంబర్ 5 : మున్సిపాలిటీలోని పలు ప్రాంతాల్లో ప్రతిష్ఠించిన గణనాథుల నిమజ్జనోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గణేశ్ మండపాల వద్ద అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్గౌడ్, నాయకులు సత్తూర్ నారాయణగౌడ్, మురళీధర్గౌడ్, అశోక్గౌడ్, గడ్డం రాములు, బోరింగ్ నర్సింహు లు, ప్రేమ్కుమార్ పాల్గొన్నారు.
మహబూబ్నగర్, సెప్టెంబర్ 5 : కలెక్టరేట్లో కొలువుదీరిన గణనాథుడికి కలెక్టర్ ఎస్.వెంకట్రావు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో కలెక్టరేట్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
మహబూబ్నగర్టౌన్, సెప్టెంబర్ 5 : జిల్లా కేంద్రంలోని టీడీగుట్టలో ఏర్పాటు చేసిన గణేశ్ మండపం వద్ద శ్రీకృష్ణ గణేశ్ యువజన సంఘం, మున్సిపల్ ఎలక్ట్రిషన్ టీఆర్ఎస్కేవీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ముం దుగా గణనాథుడికి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, కౌన్సిలర్ ఆనంద్గౌడ్, ఖమర్అలీ, చిన్నా, అంజయ్య, చిరంజీవి, సాయికుమార్, సురేశ్, రజనీకాంత్ పాల్గొన్నారు.
దేవరకద్ర రూరల్, సెప్టెంబర్ 5 : దేవరకద్ర, చిన్నచింతకుంట మండలాల్లో కొలువుదీరిన గణనాథులకు ప్రత్యేక పూజలు చేశారు. కౌకుంట్లలో కృష్ణయాదవ, ఎస్సీకాలనీలో ప్రతిష్ఠించిన గణనాథుడికి సర్పంచ్ స్వప్నాకిషన్రావు ప్రత్యేక పూజలు చేసి భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. దేవరకద్రలో కుర్వసంఘం ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన వినాయకుడికి ఎంపీపీ రమాశ్రీకాంత్యాదవ్ పూజలు నిర్వహించారు. అనంతరం మహిళలకు ముగ్గుల పోటీలు ని ర్వహించి బహుమతులను ప్రదానం చేశా రు. అలాగే అన్నప్రసాదం వితరణ చేశారు.