నెట్వర్క్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ);ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా మంగళవారం బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. బోనాలతో మహిళలు గ్రామాల శివారులో ఉన్న అమ్మవారి ఆలయం వరకు డప్పు వాయిద్యాల మధ్య ఊరేగింపుగా తరలివెళ్లారు. అమ్మవారికి బోనాన్ని సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పాడి పంటలు, పిల్లాపాపలు చల్లంగా ఉండాలని వేడుకున్నారు. ఆలయ ప్రాంగణాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి.