ఊట్కూర్, ఆగస్టు 19: స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా శుక్రవారం మండలకేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొని రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అమరుల త్యాగాల స్ఫూర్తితో యువత దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని మండల ప్రత్యేక అధికారి కృష్ణమాచారి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీడీవో కాళప్ప, సర్పంచ్ సూర్యప్రకాశ్రెడ్డి, ఎంపీటీసీ హన్మంతు, ఏపీఎం నర్సింహులు, వార్డు సభ్యుడు షేక్షమీ తదితరులు పాల్గొన్నారు.
మక్తల్, కర్ని పీహెచ్సీలో..
మక్తల్ టౌన్, ఆగస్టు 19: స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు శుక్రవారం ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి మక్తల్ ప్రభుత్వ దవాఖాన, మండలంలోని కర్ని పీహెచ్సీలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిట్టెం మాట్లాడుతూ వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలనే లక్ష్యంతో పలు కార్యక్రమాలను చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీధర్, ఈవోపీఆర్డీ పావని, మున్సిపల్ కమిషనర్ నర్సింహులు, వైస్ చైర్పర్సన్ అఖిల, కౌన్సిలర్లు సత్యనారాయణ, రాములు, ఈశ్వరమ్మ, మొగులప్ప, వైద్య సిబ్బంది, నాయకులు మహిపాల్రెడ్డి, అమరేందర్, రవిశంకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
దామరగిద్ద మండలంలో..
దామరగిద్ద, ఆగస్టు 19: మండలకేంద్రంలోని సర్కారు దవాఖానలో ఎంపీపీ బక్క నర్సప్స ఆధ్వర్యంలో రోగులకు పండ్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ దామోదర్రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా నాయకుడు వెంకట్రెడ్డి, సర్పంచ్ వన్నడి ఆశమ్మ, ఎంపీవో రామన్న, దవాఖాన సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మరికల్ మండలంలో..
మరికల్, ఆగస్టు 19: స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని శుక్రవారం మండలకేంద్రంలోని పీహెచ్ సీలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్పర్సన్ గౌని సురేఖారెడ్డి, సర్పంచ్ కస్పే గోవర్ధన్, ఎంపీటీసీ గోపాల్, నాయకులు రాజేశ్, శ్రీనివాసులు, ఉప సర్పంచ్ శివకుమార్, మండల కోఆప్షన్ సభ్యులు మతీన్, హన్మిరెడ్డి, తాసిల్దార్ నాగలక్ష్మి, ఎంపీడీవో యశోదమ్మ, సిబ్బంది సుధాకర్రెడ్డి, గోపాల్రావు, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్రావు, చంద్రశేఖర్, ఎంపీవో బాలాజీ తదితరులు పాల్గొన్నారు.
ధన్వాడ మండలంలో..
ధన్వాడ, ఆగస్టు 19: మండలంలోని సర్కారు దవాఖానలో శుక్రవారం రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అదేవిధంగా మండలంలోని పదిమంది పేద కుటుంబాలకు టీఆర్ఎస్ నాయకులు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో సద్గుణ, ఎంపీటీసీ జట్రం గోవర్ధన్గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, యూత్ అధ్యక్షుడు సునీల్రెడ్డి, ఉపాధ్యక్షులు సచిన్, వీరేశ్కుమార్, వడ్ల శాంతికుమార్, షాకీర్హుస్సేన్ పాల్గొన్నారు.
మాగనూర్ మండలంలో..
మాగనూర్, ఆగస్టు 19: మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం ఎంపీడీవో సుధాకర్రెడ్డి, ఎంపీపీ శ్యామలమ్మ, జెడ్పీటీసీ వెంకటయ్య, సర్పంచ్ రాజు రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆర్ఐ శ్రీశైలం, జూనియర్ ఆసిస్టెంట్ రామకృష్ణ, డాక్టర్ శ్రావణి, అజయ్రాజ్, ఫార్మసిస్టు వెంకట్రాంరెడ్డి, స్టాఫ్ నర్సులు శ్వేత, గోపాలకృష్ణ, వెంకటేశ్, యాదమ్మ, గ్రామ కార్యదర్శి కిశోర్ తదితరులు పాల్గొన్నారు.
నర్వ మండలంలో..
నర్వ, ఆగస్టు 19: స్వతంత్ర భారత వజ్రోత్సవాల సంద ర్భంగా శుక్రవారం విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వ హించారు. అదేవిధంగా మండలకేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో రోగులకు ప్రజాప్రతినిధులు, అధికారులు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ జయరాములుశెట్టి మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాలమేరకు 22వ తేదీ వరకు వజ్రోత్సవాలు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ వీణావతి, సర్పంచ్ సంధ్య, తాసిల్దార్ దయాకర్రెడ్డి, ఎంపీడీవో రమేశ్కుమార్, అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.