అమరచింత, ఆగస్టు 19 : జూరాల ప్రాజెక్టుకు వరద కొనసాగుతున్నది. శుక్రవారం సాయంత్రానికి 2.10 ల క్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదైంది. ప్రాజెక్టు నుంచి 40 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. విద్యుదుత్పత్తి కోసం 30,087 క్యూసెక్కులు వినియోగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. బీమా లిఫ్ట్-2కు 750, ఎడమ కాల్వకు 920, కుడి కాల్వకు 608 క్యూ సెక్కులు వదిలారు. దీంతో ప్రాజెక్టు నుంచి మొత్తం 2,10,193 క్యూసెక్కుల అవుట్ఫ్లో నమోదైంది.
శ్రీశైలం జలాశయంలో..
శ్రీశైలం, ఆగస్టు 19 : శ్రీశైలం జలాశయానికి వరద నిలకడగా కొనసాగుతున్నది. రిజర్వాయర్ నీటిమట్టం పూర్తి స్థాయికి చేరుకుంటుండగా.. ప్రవాహానికి తగినట్లుగా 8 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నా రు. శుక్రవారం జూరాల గేట్ల ద్వారా 1,77,010, విద్యుదుత్పత్తి నుంచి 30,087, సుంకేసుల నుంచి 38,493 క్యూసెక్కులు విడుదల కాగా, సాయంత్రానికి శ్రీశైలం జలాశయానికి 2,89,099 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదైంది. ఏపీ పవర్హౌస్కు 30,881, టీఎస్ పవర్హౌస్కు 31,784 క్యూసెక్కులు వదిలారు. ఎనిమిది గేట్ల నుంచి 2,23,864 క్యూసెక్కులు విడుదల చేశారు. జలాశయం పూర్తిస్థాయి సామర్థ్యం నిల్వ 885 అడుగులు కాగా, ప్రస్తుతం 884.80 అడుగులు ఉన్నది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 214.84 టీఎంసీలుగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
తుంగభద్ర డ్యాంకు వరద..
అయిజ, ఆగస్టు 19 : ఎగువ ప్రాంతంలో కురుస్తు న్న వర్షాలకు కర్ణాటకలోని తుంగభద్ర డ్యాంకు వరద కొనసాగుతున్నది. శుక్రవారం ఇన్ఫ్లో 34,436, అవుట్ఫ్లో 33,945 క్యూసెక్కులుగా నమోదైంది. పూర్తిస్థా యి సామర్థ్యం 105.788 టీఎంసీలకుగానూ ప్రస్తుతం 105.788 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. నీటిమట్టం 1633 అడుగులకుగానూ 1633 అడుగులకు చేరినట్లు డ్యాం ఎస్ఈ శ్రీకాంత్రెడ్డి తెలిపారు. ఆర్డీఎస్కు ఇన్ఫ్లో 39,036 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 38,600 క్యూసెక్కులుగా నమోదైనట్లు ఏఈ శ్రీనివాస్ తెలిపారు. ఆయకట్టుకు 436 క్యూసెక్కులు విడుదల చేస్తుండగా.. ప్రస్తు తం 10.6 అడుగుల నీటిమట్టం ఉన్నట్లు పేర్కొన్నారు.
సుంకేసుల డ్యాంకు ఇన్ఫ్లో..
రాజోళి, ఆగస్టు 19 : సుంకేసుల డ్యాంకు టీబీ డ్యాం నుంచి 40 వేలకుపైగా క్యూసెక్కుల ఇన్ఫ్లో నమో దు కాగా 9 గేట్లను మీటర్ ఎత్తుకు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. అవుట్ఫ్లో 38,493 నమోదవగా.. కేసీ కెనాల్కు 1,205 క్యూసెక్కులు తరలిస్తున్నారు.