పాలమూరు, ఆగస్టు 18 : అణగారిన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపిన బహుజన నాయకుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ అని జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్రెడ్డి అన్నారు. జెడ్పీ సమావేశ మందిరంలో గురువారం సర్వాయి పాపన్నగౌడ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జెడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ బహుజనుల కోసం పాపన్నగౌడ్ తన ప్రాణాన్ని ఫణంగా పెట్టారని గుర్తుచేశారు. బ్రిటీష్, మొగులల దురహంకార ఆగడాలను అరికట్టేందుకు 12మందితో సైన్యాన్ని మొదలుపెట్టి 12వేలమందిని తయారు చేశారని తెలిపారు. ఔరంగజేబును ఢీకొట్టి గోల్కొండ కోటను ఏలిన గొప్ప నాయకుడు సర్దార్ సర్వాయి పాపన్న అని కొనియాడారు. అలాంటి వ్యక్తి జయంతిని అధికారికంగా నిర్వహించేందుకు మంత్రి శ్రీనివాస్గౌడ్ చేసిన కృషి మరవలేనిదన్నారు. కార్యక్రమంలో ఇన్చార్జి కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్గౌడ్, ముడా చైర్మన్ గంజి వెంకన్న, ఎంపీపీ సుధాశ్రీ, ఎక్సైజ్ సూపరింటెండెంట్ సైదులు, బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి ఇందిర తదితరులు పాల్గొన్నారు.
జడ్చర్ల పట్టణంలో..
జడ్చర్లటౌన్, ఆగస్టు 18 : విప్లవవీరుడు సర్దార్ సర్వా యి పాపన్నగౌడ్ జయంతిని జడ్చర్లలోని మినీ స్టేడియం లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి జెడ్పీ వైస్చైర్మన్ యాదయ్య పూలమాల వేసి నివాళులర్పించారు. అదేవిధంగా బీసీసేన, బీఎస్పీ ఆధ్వర్యంలో పాపన్నగౌడ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి, తాసిల్దార్ లక్ష్మీనారాయణ, ఎంపీడీవో ఉమాదేవి, ఎం ఈవో మంజులాదేవి, మున్సిపల్ కమిషనర్ మహమూద్షేక్, కౌన్సిలర్లు ఉమాశంకర్గౌడ్, లత, జ్యోతి, చైతన్యగౌడ్, సతీశ్, బీసీసేన రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణయాదవ్, బీఎస్పీ నియోజకవర్గ ఇన్చార్జి బాలవర్ధన్గౌడ్ ఉన్నారు.
నవాబ్పేట మండలంలో..
నవాబ్పేట, ఆగస్టు 18 : మండలకేంద్రంతోపాటు కొల్లూరు, కొండాపూర్, పోమాల, యన్మన్గండ్ల, తీగల్పల్లి, ఇప్పటూర్, కాకర్లపహాడ్ తదితర గ్రామాల్లో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతిని ఘనంగా జరుపుకొన్నారు. నవాబ్పేట బస్టాండ్ చౌరస్తాలో మండల గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఉత్సవాలకు వివిధ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు హాజరై పాపన్నగౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంపీపీ అనంతయ్య, సింగిల్విండో చైర్మన్ మాడెమోని నర్సింహులు, మార్కెట్ కమిటీ చైర్మన్ మెండె లక్ష్మయ్య, వైస్చైర్మన్ చందర్నాయక్, సర్పంచులు గోపాల్గౌడ్, సత్యం, కృష్ణయ్య, బొజ్జమ్మ, మాజీ ఎంపీపీ శీనయ్య, గౌడ సంఘం మండ ల నాయకులు కృష్ణగౌడ్, వెంకటేశ్గౌడ్, దశరథంగౌడ్, రవిగౌడ్, నాయకులు ప్రతాప్, మెండె శ్రీను, రఘుగౌ డ్, యాదయ్య, అబ్దుల్లా, నవనీతరావు, పాశం గోపాల్, సంజీవరెడ్డి, నర్సింహులు, శేఖర్రెడ్డి, రామకృష్ణగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
రాజాపూర్ మండలంలో..
రాజాపూర్, ఆగస్టు 18 : మండలకేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతిని గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షుడు ఆనంద్గౌడ్, భీమయ్యగౌడ్, సత్యనారాయణగౌడ్, రామకృష్ణాగౌడ్, గంగాధర్, శేఖర్, మల్లేశ్, ఉద్దేశ్, వేణు, చంద్రకాంత్, లక్ష్మీనారాయణ, గిరిగౌడ్ పాల్గొన్నారు.
మిడ్జిల్ మండలంలో..
మిడ్జిల్, ఆగస్టు 18 : మండలకేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతిని గౌడ సంఘం నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ గౌస్, పీఏసీసీఎస్ వైస్చైర్మన్ అల్వాల్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు వెంకట్రెడ్డి, భాస్కర్, నవీనాచారి, గౌడ సంఘం నాయకులు రమేశ్గౌడ్, భాస్కర్గౌడ్, హరిగౌడ్, నరేశ్గౌడ్, అనిల్గౌడ్, శివగౌడ్, రాఘవేందర్గౌడ్ పాల్గొన్నారు.
బాలానగర్ మండలంలో..
బాలానగర్, ఆగస్టు 18 : బహుజన విప్లవవీరుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ అందించిన సేవలు చిరస్మరణీయమని టీఆర్ఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ బాలూనాయక్, యూత్వింగ్ మండల అధ్యక్షుడు సుప్ప ప్రకాశ్ అన్నారు. పాపన్నగౌడ్ జయంతి సందర్భంగా మండలకేంద్రంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో రైతుబం ధు సమితి మండల అధ్యక్షుడు గోపాల్రెడ్డి, నాయకులు రాఘవేందర్గౌడ్, యాదిగిరిగౌడ్, తిరుపతి, శంకర్నాయక్, దత్తాత్రేయ, వెంకటయ్య పాల్గొన్నారు.
మూసాపేట మండలంలో..
మూసాపేట, ఆగస్టు 18 : మండలంలోని వేముల లో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ యాట సత్యనారాయణ, మాజీ సర్పంచ్ ఆం జనేయులుగౌడ్, కృష్ణయ్య, సత్యనారాయణరెడ్డి, రవీందర్గౌడ్, రాములుగౌడ్, సుధాకర్గౌడ్, ఎండీ ఖాసీం, నాగన్న, మన్యంకొండ, ప్రవీణ్ పాల్గొన్నారు.
కోయిలకొండ మండలంలో..
కోయిలకొండ, ఆగస్టు 18 : మండలకేంద్రంలోని వివేకానందచౌరస్తాలో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి ఎంపీడీవో జయరాం, ఎస్సై శ్రీనయ్య పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ కృష్ణయ్య, మాజీ ఎంపీపీ మహేందర్గౌడ్, గౌడ సంఘం మండల అధ్యక్షుడు పవన్కుమార్గౌడ్, జగన్గౌడ్, విద్యాసాగర్గౌడ్, రవిగౌడ్, భరత్గౌడ్, రాజుగౌడ్, లక్కీగౌడ్, బాలుగౌడ్, ఆంజనేయులుగౌడ్, తిరుపతిగౌడ్, రాముగౌడ్ పాల్గొన్నారు.