మహబూబ్నగర్టౌన్, ఆగస్టు 18 : క్రీడలతో ఆరోగ్యంగా ఉంటారని ఇన్చార్జి కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా గురువారం జిల్లా కేంద్రం సమీపంలోని కేసీఆర్ ఎకో అర్బన్ పార్కులో ప్రభుత్వ ఉద్యోగులకు నిర్వహించిన ఫ్రీడమ్ కప్ క్రీడాపోటీలను ప్రా రంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిత్యం విధినిర్వహణలో బిజీబిజీగా ఉండే ప్రభుత్వ ఉద్యోగులకు క్రీడలు మానసిక ఉల్లాసం, ఉత్తేజాన్ని కలిగిస్తాయని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు స్వతంత్ర భారత వజ్రోత్సవాలను జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉత్సవాల్లో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సీతారామారావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
జడ్చర్ల పట్టణంలో..
జడ్చర్లటౌన్, ఆగస్టు 18 : స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా గురువారం జడ్చర్లలోని మినీస్టేడియంలో కబడ్డీ, క్రికెట్ పోటీలను ఉత్సాహంగా నిర్వహించారు. క్రికెట్ టోర్నీలో ఎంపీడీవో కార్యాలయ జట్టు, కబడ్డీ పోటీల్లో ఎంఈవో కార్యాలయ జట్టు విజ యం సాధించాయి. అనంతరం విజేత జట్లకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్చైర్మన్ యాదయ్య, మున్సిపల్ చైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మి, తాసిల్దార్ లక్ష్మీనారాయణ, ఎంపీడీవో ఉమాదేవి, ఎంఈ వో మంజులాదేవి, మున్సిపల్ కమిషనర్ మహమూద్షేక్, కౌన్సిలర్లు సతీశ్, ఉమాశంకర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
బహుమతులు ప్రదానం
భూత్పూర్, ఆగస్టు 18 : స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా భూత్పూర్ ఉన్నత పాఠశాలలో ప్రజాప్రతినిధులు, అధికారులకు క్రీడాపోటీలు నిర్వహించారు. వాలీబాల్, రింగ్బాల్, పరుగుపందెం, ముగ్గుల పోటీలు నిర్వహించారు. పోటీల్లో ప్రతిభకనబర్చిన క్రీడాకారులకు ఎంపీపీ కదిరె శేఖర్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్గౌడ్ బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో తాసిల్దార్ చెన్నకిష్టన్న, మున్సిపల్ కమిషనర్ నూరుల్నజీబ్, పశువైద్యాధికారి మధుసూదన్, ఎంపీవో విజయకుమార్, ఏవో మురళీధర్, వైస్ఎంపీపీ నరేశ్గౌడ్, కౌన్సిలర్ బాలకోటి, కోఆప్షన్ సభ్యుడు అజీజ్, ముడా డైరెక్టర్ సాయిలు, సత్తూర్ నారాయణగౌడ్, మురళీధర్గౌడ్, అశోక్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
క్రీడలతో మానసికోల్లాసం
బాలానగర్, ఆగస్టు 18 : క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందని తాసిల్దార్ శ్రీనివాసులు అన్నా రు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా గురువారం మండలంలోని అప్పాజిపల్లిలో పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్ సిబ్బందికి ఏర్పాటు చేసిన క్రికెట్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీడలతో శారీరక దారుఢ్యం పెంపొందడంతోపాటు పని ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుందన్నారు. క్రికెట్ పోటీల్లో క్రీడాస్ఫూర్తిని చాటాలని సూ చించారు. కార్యక్రమంలో సర్పంచ్ శారదాబాలూనాయక్, ఎంపీడీవో కృష్ణారావు, ఏపీఎం రాజశేఖర్, ఆర్ ఐ వెంకట్రెడ్డి, టీఆర్ఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ బాలూనాయక్, పంచాయతీ కార్యదర్శులు పాండూనాయక్, అనిల్, బాసు రాథోడ్, ఆంజనేయులు, వినో ద్, నరేశ్, టీఆర్ఎస్ నాయకులు శ్రీను, బాలూనాయక్ తదితరులు పాల్గొన్నారు.