మక్తల్ టౌన్/ మరికల్ ఆగస్టు 16 : రాష్ట్రంలోని ప్రభు త్వ పాఠశాలల అభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్ నిధులు కేటాయిస్తున్నారని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నా రు. మక్తల్ నియోజకవర్గంలోని మరికల్ మండలం గాజులయ్య తండాలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు బెస్ట్ స్కూల్ అవార్డు అందుకున్న హెచ్ఎం లక్ష్మయ్యను మంగళవారం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఎ మ్మెల్యే చిట్టెం శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన తండాలొని ప్రభుత్వ పాఠశాలను ఉత్తమగా తీర్చిదిద్ది ప్రైవేట్ పాఠశాలకు దీటుగా చేసి న హెచ్ఎం కృషిని అందరూ అభినందించాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచడంతోపాటు ఆవరణను సర్వాంగ సుందరంగా మార్చిన ఉపాధ్యాయులకు ప్ర త్యేకంగా అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ భాస్కర్నాయక్, నాయకులు పాల్గొన్నారు.
‘రోడ్డు సమస్య పరిష్కారం’
మాగనూర్, ఆగస్టు 16 : మండలంలోని నేరడగంలో రైట్ లోలేవల్ కెనాల్ కాల్వ ఉజ్జల్లి, బైరంపల్లి, కర్ణాటకు వెళ్లే రోడ్డు కల్వర్టు మార్గమధ్యం లో కురుస్తున్న వర్షాల కారణంగా రం ద్రంపడి వాహనదారులు ఇబ్బందుల కు గురువుతున్నారు. గ్రామాల నాయకుల నుంచి విషయం తెలుసుకన్న ఎ మ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి మంగళవారం ఘటన స్థలానికి వచ్చారు. స ర్పంచ్ అశోక్గౌడ్, ఎంపీటీసీ ఎల్లారె డ్డి సహకారంతో ప్రస్తుతానికి సమస్యను పరిష్కరించారు. కాల్వపై రెండు రోజుల్లో నూతన కల్వర్టు ఏర్పాటు చేయిస్తానని ఆయన తెలిపారు. అనంతరం రైట్ లోలెవేల్ కెనాల్ కాల్వను పరిశీలించి ఏపుగా పెరిగిన పిచ్చిమొక్కలను తొలగించాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు.