వనపర్తి, ఆగస్టు16 (నమస్తే తెలంగాణ): భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలు ఒక అద్భుతమని వ్యవసాయ, సహకారశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. వజ్రోత్సవాల్లో భాగంగా వనపర్తి సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటుచేసిన సామూహిక గీతాలాపన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి హాజరై ప్రసంగించారు. స్వాతంత్య్రం కోసం ప్రాణాలు త్యాగం చేసిన వారిని స్మరించుకోవడం గొప్ప అవకాశమన్నారు. స్వాతంత్య్రం విలువ ప్రస్తుత తరాలకు తెలిస్తే భవిష్యత్ తరాలకు అర్థమవుతుందన్నారు. అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు వారాల పాటు వజ్రోత్సవ సంబురాలను రూపకల్పన చేశారని చెప్పారు. రాష్ట్రంలో అనేక అభివృద్ధి పనులు జరిగాయని, మిషన్ భగీరథ పథకం ప్రపంచంలోనే గొప్ప పథకం అని కొనియాడారు. ప్రపంచంలో అనేక దేశాలు తిరిగానని, ఎక్కడా ఇంత గొప్ప పథకం లేదని చెప్పారు. మినరల్ వాటర్తో పోల్చితే భగీరథ నీళ్లు ఆరోగ్యానికి ఎంతో మంచివన్నారు. ఈ నెల 22న వజ్రోత్సవాలు ముగిసిన తర్వాత వజ్ర సంకల్పం పేరుతో అధికారులు 24 నుంచి అధికారులు పల్లెనిద్ర చేయాలని సూచించారు. ప్రజలతో మమేకం అవ్వడం ద్వారా సమస్యల పరిష్కారానికి కృషి చేయవచ్చన్నారు. నియోజకవర్గంలో ఆరు మండలాల్లో 42 గ్రామాలు, వనపర్తి మున్సిపాలిటీలో మూడు వార్డులు, పెబ్బేరు మున్సిపాలిటీలో రెండు వార్డుల్లో పల్లెనిద్ర చేయాలన్నారు. వనపర్తి నియోజకవర్గంలో తీసుకున్న కార్యక్రమం రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు స్ఫూర్తిగా నిలవాలని సూచించారు.
3వేల అడుగుల పతాక ప్రదర్శన రికార్డు
వనపర్తిలో మూడు కిలోమీటర్ల (మూడు వేల అడుగుల) పొడవు ఉన్న జాతీయ పతాకం ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందన్నారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ నుంచి సమీకృత కార్యాలయం వరకు యువకులు, విద్యార్థులు, అధికారులు సహా వేలాది మంది పొడవైన జాతీయ పతాకాన్ని ఎత్తుకొని నడిచారని మంత్రి అన్నారు. సృజనాత్మకతతో దేశభక్తితో రూపొందించిన పొడవైన జాతీయ పతాకం రికార్డు నమోదు చేస్తుందని అన్నారు. కార్యక్రమానికి సహకరించిన కలెక్టర్ యాస్మిన్ బాషా, అధికారులు, విద్యార్థులు, ప్రజలు, పాఠశాలల యాజమాన్యాలు, పోలీసు శాఖకు సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఆశిష్ సంగ్వాన్, వేణుగోపాల్, ఏఎస్పీ షాకీర్ హుస్సేన్, డీఎస్పీ ఆనంద్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, మాజీ మున్సిపల్ చైర్మన్ రమేశ్గౌడ్ పాల్గొన్నాకొత్త పింఛన్లకు సర్వం సిద్ధం
పెబ్బేరు, ఆగస్టు 16: సబ్బండ వర్గాల ప్రజల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. మంగళవారం వనపర్తి జిల్లా పెబ్బేరులోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో ఉమ్మడి మండలాలకు చెందిన 45మందికి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ రూ.45,05,220లక్షలు, 134మందికి రూ.31.46లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అదనపు(లోకల్ బాడీ)కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్తో కలిసి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఇంటితో పాటు వీధులను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు మంజూరీ చేసేందుకు కృషి చేస్తామన్నారు. వనపర్తి జిల్లాలో 16,023 కొత్త పింఛన్లు మంజూరయ్యాయన్నారు. త్వరలో కొత్త పింఛన్లను మంజూరీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధం చేసిందన్నారు. కొత్త, పాత పింఛన్ల లబ్ధిదారులకు బార్కోడ్తో కూడిన కార్డులను ప్రతి గ్రామానికి వచ్చి లబ్ధిదారులకు పంపిణీ చేస్తామన్నారు. తెలంగాణ ఏర్పాటై 9ఏండ్లు అవుతుండగా..దేశానికి బానిస సంకెళ్ల నుంచి విముక్తి కలిగి 75ఏళ్లు పూర్తయినా సందర్భంగా వజ్రోత్సవాలు జరుపుకొంటున్నామన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు కరుణశ్రీ, శైలజ, పద్మ, గాయత్రి, కర్రెస్వామి, కోదండరాంరెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బుచ్చారెడ్డి పాల్గొన్నారు.