వనపర్తి, ఆగస్టు15 (నమస్తే తెలంగా ణ): ఎందరో మహానుభావుల పోరాటా లు, త్యాగాల ఫలితంగా భరత మాతకు విముక్తి లభించి 75 సంవత్సరాలు పూర్తిచేసుకుని 76వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా దేశ అభ్యున్నతి కోసం అందరం పునరంకితమవుదామ ని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పిలుపునిచ్చారు. వనపర్తి జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయం లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ము ఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ షేక్ యాస్మిన్బాషాతో కలిసి మంత్రి గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వజ్రోత్సవాల్లో భాగంగా వనపర్తి జిల్లాలోనే లక్షా 35 వే ల జెండాలను ప్రజలందరూ తమ ఇం డ్లపై ఎగురవేశారని అన్నారు. అభివృద్ధి లో తెలంగాణ దూసుకుపోతున్నదని దే శంలో ఇతర రాష్ర్టాలకు ఆదర్శవంతంగా నిలుస్తున్నదన్నారు.
వనపర్తి జిల్లా అనేక రంగాల్లో అభివృద్ధిలో, సేవల్లో అగ్రగామిగా నిలుస్తుందన్నారు. సాగునీటి ప్రాజెక్టుల విషయానికి వస్తే ప్రియదర్శని కాలువ కింద ఆయకట్టు, రాజీవ్భీమా లిఫ్ట్ ఇరిగేషన్ పథకం, మహాత్మాగాంధీ, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ,బుద్ధారం రైట్ కెనాల్, ఘణపురం బ్రాంచ్ కెనాల్, చెక్డ్యాంలు, మిషన్ కాకతీయ వంటి ప థకాల ద్వారా దాదాపు లక్ష ఎకరాలకు పైగా సాగునీరు అందిస్తున్నామన్నారు. వయోపరిమితిని 57 ఏళ్లకు తగ్గించడం ద్వారా కొత్తగా 16,023 మందికి ఆ సరా పథకం లబ్ధి చేకూర్చనుందన్నారు. రూ.510 కోట్లతో మెడికల్ కళాశాల, రూ.17 కోట్లతో 180 పడకల గర్భిణీ ప్ర సవానంతర వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు.
దళితబంధు పథకం మొదటి విడుతగా జిల్లాలో 199 యూనిట్లకు రూ.19.90 కోట్లు మంజూరయ్యాయన్నారు. మన ఊరు-మన బ డి కార్యక్రమాన్ని వనపర్తి వేదికగా ప్రా రంభించడం జరిగిందన్నారు. కొత్తగా అ నుమతి లభించిన వైద్యశాలకు అనుబంధంగా నర్సింగ్ కళాశాలను రూ. 38.40 కోట్లతో నర్సింగ్ కళాశాల, రూ. 60 కోట్ల తో కలెక్టర్ కార్యాలయాన్ని నిర్మించుకున్నట్లు చెప్పారు. స్వచ్ఛ సర్వేక్షణ్లో భా గంగా సౌత్జోన్లో వనపర్తి మున్సిపాలిటీ 51వ ర్యాంకు, రాష్ట్ర స్థాయిలో 6వ ర్యాంకు సాధించిందని వెల్లడించారు. ఉత్తమ సేవలందించిన అధికారులకు సి బ్బందికి ప్రశంసాపత్రాలు అందజేశా రు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ లోకనాథ్రెడ్డి, అదనపు కలెక్టర్లు సెంగ్వాన్, వేణుగోపాల్, మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, వైస్ చైర్మన్ శ్రీధర్, మాజీ మున్సిపల్ చైర్మన్ రమేశ్గౌడ్, ఏఎస్పీ షాకీర్ హుస్సేన్, డీఎస్పీ ఆనంద్రెడ్డి ఉన్నారు.