గద్వాల, ఆగస్టు 15: త్రివర్ణ జెండా ఎగుర వేసే పవిత్రమైన రోజు ఆగస్టు 15అని, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు రాజీవ్శర్మ అన్నారు. సోమవారం 76వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని పరేడ్ మై దానంలో జెండావిష్కరణకు ముఖ్య అతిథిగా హాజరై పోలీసుల గౌరవ వందనం స్వీ కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాజీవ్ శర్మ మాట్లాడారు. సం క్షేమ అభివృద్ధి ఫలాలు అందరికీ అందించమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. రైతు బం ధు, రైతు బీమా పథకాల ద్వారా ప్రభుత్వం రైతులకు చేయూతనిస్తుందన్నారు. ఇప్పటి వరకు రైతుబంధు పథకం ద్వారా వానకాలంలో లక్షా అరవై వేల మందికి లబ్ధి చేకూరిందని, రైతుబీమా నుంచి 2020 మంది రైతులకు బీమా పరిహారం అం దించామన్నారు. జిల్లాలోని జూరాల, తుమ్మిళ్ల, నెట్టెంపాడ్ ఎత్తిపోతల పథకం ద్వారా నీటి లభ్యతను బట్టి 2,27,000 ఎకరాలకు సాగునీరు అందిస్తున్నట్లు తెలిపారు.
మి షన్ భగీరథ పథకం ద్వారా జిల్లాలో 311 ఆవాసాలు, నాలుగు మున్సిపాలిటీల్లో ప్రజల దాహార్తిని తీర్చడానికి రూ.700కోట్లతో 1400వందల కిలో మీటర్ల మేర పైపు లైన్ వేసి 1,38,000వేల నల్ల కనెక్షన్లు ఇచ్చినట్లు తెలిపారు. మన ఊరు మన బడి కింద 161 పాఠశాలలను ఎంపిక చేసి అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. కమ్యూనిటీ పోలిసింగ్ కింద 494, నేను సైతం కార్యక్రమం ద్వారా 885 సీసీ కె మెరాలు ప్రజలతో ఏర్పాటు చేయించడం గర్వకారణమని తెలిపారు. జిల్లా అభివృద్ధిలో అందరూ భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. స్వాతంత్య్ర ఉద్యమకారుల కుటుంబాలను సన్మానించారు. అనంతరం జిల్లాలో వివిధ శాఖలో విధి నిర్వహణలో గుర్తింపు పొందిన వారిని ప్రశంసా పత్రంతో సన్మానించారు.
స్వతంత్య్ర భారత వ జ్రోత్సవాలను పురస్కరించుకొని ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రా రంభించారు. ఈ వేడకుల్లో కలెక్టర్ వల్లూరు క్రాంతి, ఆర్డీవో రాములు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ సరిత, ఎమ్మెల్యేలు కృష్ణమోహన్రెడ్డి, అబ్రహం, మున్సిపల్ చైర్మన్ కేశవ్, జిల్లా గ్రంథాల సంస్థ చైర్మన్ విష్ణువర్ధన్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ రామేశ్వరమ్మ, ఎంపీపీ ప్రతాప్గౌడ్, జెడ్పీ వైస్ చైర్మన్ సరోజమ్మ, మాజీ జెడ్పీ చైర్మన్ బండారి భాస్క ర్, మాజీ డీసీసీబీ చైర్మన్ గట్టు తిమ్మప్ప పాల్గొన్నారు.