జడ్చర్ల, ఆగస్టు 14 : స్వతంత్ర భారత వజ్రోత్సవ సంబురాలు జడ్చర్ల మండలంలో ఘనంగా కొనసాగుతున్నాయి. మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో ఆదివారం జానపద కళాప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా జానపద కళాకారులు దేశభక్తి, గ్రామీణ పాటలు పాడుతూ నృత్యాలు చేయడంతోపాటు కోలాటం ఆడారు. అలాగే పట్టణంలోని వివిధ పాఠశాలల విద్యార్థులు నృ త్యాలు చేశారు. ప్రతిభకనబర్చిన విద్యార్థులకు కౌన్సిలర్లు కోట్ల ప్రశాంత్రెడ్డి, కుమ్మరి రాజు నగదు బహుమతులను అందజేశారు. అలాగే మున్సిపాలిటీతోపాటు అన్ని గ్రామాల్లో ప్రతి ఇంటిపై జాతీయ పతాకం ఎగురవేశారు. కార్యక్రమం లో జెడ్పీ వైస్చైర్మన్ యాదయ్య, మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి, ఎంఈవో మంజులాదేవి, ఎంపీడీవో ఉమాదేవి, మిడ్జిల్ ఎంపీవో అనురాధ, తాసిల్దార్ లక్ష్మీనారాయణ, మున్సిపల్ కమిషనర్ మహమూద్షేక్, కౌన్సిలర్లు లత, ఉమాదేవి, సర్పంచులు ప్రణీల్, ప్రభాకర్రెడ్డి, రవీందర్రెడ్డి, బాలసుందర్రెడ్డి, శ్రీనివాసులు, వెంకట్రెడ్డి, రామకృష్ణారెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రఘుపతిరెడ్డి పాల్గొన్నారు.
దేవరకద్ర మండలంలో..
దేవరకద్ర రూరల్, ఆగస్టు 14 : స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా దేవరకద్రలోని శ్రీనివాసగార్డెన్లో జానపద కళాప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమానికి భూ త్పూర్, మూసాపేట, అడ్డాకుల, చిన్నచింతకుంట, దేవరకద్ర మండలాల అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కళాకారులు జాతీయ గీతాలను ఆలపిస్తూ నృత్యం చేశారు. అలాగే మండల ప్రజాప్రతినిధులు, అధికారులు, ఐసీడీఎస్ సిబ్బందితో కలిసి ఎంపీపీ రమాదేవి, ఎంపీడీవో శ్రీనివాసు లు నృత్యాలు చేశారు. అనంతరం ఆయా మండలాలకు చెందిన 16మంది మానసిక దివ్యాంగులు, బడిబయటి పిల్లలకు పోషకాహార కిట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి శంకరాచారి, ఎంపీవో శ్రీనివాసరావు, ఐసీడీఎస్ సీడీపీవో శైలశ్రీ, పీఏసీసీఎస్ చైర్మన్ నరేందర్రెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు కొండారెడ్డి, శ్రీకాంత్యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
మూసాపేట మండలంలో..
మూసాపేట, ఆగస్టు 14 : మండలంలోని అన్ని గ్రామా ల్లో స్వతంత్ర భారత వజ్రోత్సవాలు కొనసాగుతున్నాయి. జానంపేటలో మసీదు కమిటీ ఆధ్వర్యంలో జెండాలతో ర్యాలీ నిర్వహించారు. అలాగే తిమ్మాపూర్లో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించి స్వాతంత్య్ర సమరయోధులను స్మరించుకున్నారు.
బాలానగర్ మండలంలో..
బాలానగర్, ఆగస్టు 14 : వజ్రోత్సవాల్లో భాగంగా మండలకేంద్రంలోని ఏకలవ్య గురుకుల పాఠశాలలో ఆదివారం విద్యార్థులకు కబడ్డీ పోటీలు నిర్వహించారు. అలాగే పోటీల్లో అధికారులు పాల్గొని కబడ్డీ ఆడారు. కార్యక్రమంలో తాసిల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీవో కృష్ణారావు, ఆర్ఐ వెంకట్రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
రాజాపూర్ మండలంలో..
రాజాపూర్, ఆగస్టు 14 : వజ్రోత్సవాలను పురస్కరించుకొని మండలకేంద్రంలో రెండు రోజులుగా నిర్వహించిన మండలస్థాయి క్రీడాపోటీలు ఆదివారం ముగిశాయి. బా లుర విభాగం వాలీబాల్ టోర్నీలో రంగారెడ్డిగూడ మొదటి, తిర్మలాపూర్ ద్వితీయ బహుమతులు సాధించాయి. ఖో ఖోలో రాజాపూర్ ప్రథమ, తిర్మలాపూర్ ద్వితీయ, కబడ్డీ టో ర్నీలో రాజాపూర్ ప్రథమ స్థానంలో నిలిచాయి. అలాగే బాలికల విభాగం వాలీబాల్ టోర్నీలో రాజాపూర్ ప్రథమ, తిర్మలాపూర్ ద్వితీయ, ఖోఖోలో రాజాపూర్ ప్రథమ, తిర్మలాపూర్ ద్వితీయ, కబడ్డీ టోర్నీలో రంగారెడ్డిగూడ మొదటి, తిర్మలాపూర్ ద్వితీయ స్థానంలో నిలిచాయి. పోటీల్లో ప్రతిభకనబర్చిన జట్లకు డీసీఎంఎస్ చైర్మన్ ప్రభాకర్రెడ్డి బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో తాసిల్దార్ శంకర్, ఎంపీడీవో లక్ష్మీదేవి, వైస్ఎంపీపీ మహిపాల్రెడ్డి, ఎస్సై శ్రీనివాస్, సర్పంచుల సంఘం మండల అ ధ్యక్షుడు బచ్చిరెడ్డి, ఎంఈవో వెంకటయ్య, డిప్యూటీ తాసిల్దార్ శంకర్, ఆర్ఐ ఖదీర్, హెచ్ఎం ఆనంద్కుమార్ పాల్గొన్నారు.