పాలమూరు, ఆగస్టు 14 : హైదరాబాద్లో అన్ని కులాలకు ఆత్మగౌరవ భవనాలు నిర్మిస్తున్నట్లు ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వరకాలనీలో రాజరాజేశ్వరి, షిర్డీ సాయిబాబా ఆలయ ప్రాంగణంలో రూ.10లక్షలతో చేపట్టనున్న షెడ్ నిర్మాణానికి భూమిపూజ చేశారు. అనంతరం వివిధ పోటీ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన గౌడ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హైదరాబాద్లో అన్ని కులసంఘాలకు భవనాలను ఏర్పాటు చేస్తున్నామని, త్వరలో నే గౌడ భవన నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు. జిల్లా కేంద్రంలో కూడా అన్ని కులాలకు ఆత్మగౌరవ భవనాలు నిర్మించేందుకు స్థలాలు, నిధులను కేటాయించినట్లు వివరించారు. విద్యార్థులు పట్టుదలతో చదువుకొని జీవితం లో ఉన్నతంగా రాణించాలని సూచించారు. కార్యక్రమం లో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, గౌడ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకటస్వామిగౌడ్, విశ్రాంత ఉద్యోగుల సంఘం కార్యదర్శి సత్యనారాయణగౌడ్, గంగాధర్గౌడ్, రాజయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
వేడుకలను తిలకించిన మంత్రి
జెడ్పీ మైదానంలో నిర్వహించిన స్వతంత్ర భారత వ జ్రోత్సవాలను మంత్రి శ్రీనివాస్గౌడ్ తిలకించారు. ఈ సందర్భంగా పటాకులు కాల్చే కార్యక్రమాన్ని విద్యార్థులతో కలిసి వీక్షించారు. పటాకుల ప్రదర్శన మిరమిట్లు గొలిపేలా సాగింది. వివిధ రంగులతోకూడిన తారాజువ్వ లు పట్టణ ప్రజలను కనువిందు చేశాయి.