మహబూబ్నగర్ మెట్టుగడ్డ, ఆగస్టు 14 : పంద్రాగస్టు వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించేందుకు అధికార యం త్రాంగం సర్వం సిద్ధం చేసింది. స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని స్వాతంత్య్ర దినోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్ర భుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానం లో అధికారికంగా వేడుకలను నిర్వహించనున్నారు. ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను వివరించనున్నారు.
ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అలాగే ఉత్తమ సేవలు అందించిన అధికారులు, సిబ్బందికి అవార్డులను ప్రదానం చేయనున్నారు. ప్రభుత్వ ప్రగతి శకటాల ప్రదర్శనకు ఆయా శాఖల అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వేడుకల సందర్భంగా ఎలాం టి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా జిల్లావ్యాప్తంగా పోలీస్ శాఖ బందోబస్తును ఏర్పాటు చేసింది. పలు ప్రాంతాల్లో ఆదివారం పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఎస్పీ వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు మహబూబ్నగర్, జడ్చర్ల తదితర ప్రాం తాల్లో ప్రభుత్వ కార్యాలయాలు, బస్టాండ్, ప్రధాన కూడళ్లు ఇతర ప్రదేశాల్లో పోలీసు బాంబ్స్కాడ్ బృందాలు తనిఖీలు నిర్వహించారు. వేడుకల సందర్భంగా పోలీసు పరేడ్ మైదానంలో సాయుధ బలగాలు కవాతు రిహార్సల్స్ నిర్వహించారు.