నారాయణపేట టౌన్, ఆగస్టు 14 : స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ఆదివారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యం లో పట్టణంలోని 5వ వార్డులో ఇంటింటికీ తిరిగి జాతీయ జెండాలు, మిఠాయిలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఫస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ హరినారాయణ భట్టడ్ మాట్లాడుతూ సోమవారం ప్రతి ఇంటిపై జెండా ఎగురవేయాలన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చంద్రకాంత్, లయన్స్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు జ నార్దన్, సాయినాథ్, కోశాధికారి రవికుమార్గౌడ్, సభ్యులు ఆత్మారాం ఎడ్కే, జయంత్రెడ్డి, వెంకటయ్య, సదానంద్ చారి, కృష్ణమూర్తి, సరాఫ్ నాగరాజు పాల్గొన్నారు.
మక్తల్ మున్సిపాలిటీలో…
మక్తల్ అర్బన్, ఆగస్టు 14 : మున్సిపాలిటీలోని ప్రతి ఇంటికి జాతీయ జెండాను పంపిణీ చేశామని కమిషనర్ కె. నర్సింహ అన్నారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం లో ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీలోని 16 వార్డుల్లో కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది ఇంటింటికీ తిరిగి జెండాలు అందజేశారని తెలిపారు. ప్రతి ఇంటిపై జెండా ఏర్పాటు చేసుకునే విధంగా తెలుపుతూ వజ్రోత్సవ వేడుకలు ఘనం గా నిర్వహించుకోవాలన్నారు. సోమవారం మున్సిపాలిటీ లో జరిగే వేడుకలకు అన్ని పార్టీల నాయకులు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులందరూ పాల్గొనాలన్నారు.
మండలంలో బైక్ ర్యాలీ
ధన్వాడ, ఆగస్టు 14 : మండలంతోపాటు అన్ని గ్రామా ల్లో వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా ఆదివారం అఖిలపక్షాల నాయకుల ఆధ్వర్యంలో పురవీధుల గుండా జాతీయ జెం డాలను పట్టుకొని బైక్ ర్యాలీ నిర్వహించారు. భారత్మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.
మక్తల్ మండలంలో..
మక్తల్, ఆగస్టు 14 : మండలంలోని చిట్యాలలో ఆదివారం బైక్ ర్యాలీ నిర్వహించారు. హర్ ఘర్ తిరంగ్ యా త్రలో భాగంగా జాతీయ జెండాలను చేతపట్టుకొని యు వకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. భారత్ మతాకీ జై అం టూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. అలాగే సర్పంచ్ జానకి ఆధ్వర్యంలో గ్రామంలో ఇంటింటికీ జాతీయ జెండాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ రాంలింగప్ప, నాయకులు లక్ష్మయ్య, రాములు, చెన్నరెడ్డి, రమేశ్, డీలర్ వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
దామరగిద్ద మండలంలో…
దామరగిద్ద, ఆగస్టు 14 : మండలంలోని ముస్తాపేట సర్పంచ్ లాలప్ప ఆధ్వర్యంలో ఆదివారం జాతీయ జెండాలతో ప్రదర్శనలు నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రతిఒక్కరూ దేశభక్తిని అలవర్చుకోవాలని అన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
ప్రతి ఇంటా తిరంగా జెండా
మరికల్, ఆగస్టు 14 : వజ్రోత్సవాలను పురస్కరించుకొని మండలకేంద్రంలో ప్రతి ఇంటా తిరంగా జెండాను ఎగరవేయాలని టీఆర్ఎస్ యువజన నాయకుడు సుధాకర్గౌడ్ ఆన్నారు. జాతీయ జెండాలను ఆదివారం పంపిణీ చేశారు. 1వ వార్డులో వార్డు సభ్యురాలు మంజుల ఆధ్వర్యంలో సర్పంచ్ గోవర్ధన్తో జెండాలను పంపిణీ చేయించారు. హరిజన్వాడలో ఎంపీటీసీ గోపాల్ ఆధ్వర్యంలో జెండాలను పంపిణీ చేశారు.