మక్తల్ టౌన్, ఆగస్టు 14 : స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలు అట్టహాసంగా నిర్వహించాలనే లక్ష్యంతో ప్ర భుత్వం చేపట్టిన కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో వజ్రోత్సవ వేడుకలు ఆదివా రం జరిగాయి. మక్తల్ నియోజకవర్గ స్థాయిలోని పాఠశాలల విద్యార్థులకు ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను మక్తల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల మినీ స్టేడియంలో ఏ ర్పాటు చేశారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. అంతకుముందు మక్తల్ కుర్వ సం ఘం ఆధ్వర్యంలో డోళ్లు డప్పులతో భారీఎత్తున ర్యాలీ నిర్వ హించి మినీ స్టేడియానికి చేరుకున్న ఎమ్మెల్యే జాతీయ నా యకుల చిత్రపటాలకు పూజలు చేసి, జాతీయ జెండాను ఆవిష్కరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభంలో కుర్వ సంఘం నాయకులు డప్పులతో ప్రదర్శన నిర్వహించారు.
అనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు చేశా రు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చక్కగా నృత్యాలు చేయడం ఆనందదాయకమన్నా రు. కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమ సీనియర్ నేత, రా ష్ట్ర ట్రేడ్ యూనియన్ ఆఫ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవరి మల్లప్ప, ఎంపీపీ వనజ, వ్యవసాయ శాఖ జిల్లా అధికారి, ప్రత్యేకాధికారి జాన్ సుధాకర్, మున్సిపల్ కమిషనర్ నర్సిం హులు, ఎంఈవో లక్ష్మీనారాయణ, మాగనూర్, నర్వ జెడ్పీటీసీలు జ్యోతికిరణ్ ప్రకాశ్రెడ్డి, వెంకటయ్య, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు శ్రీనివాస్గుప్తా, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మహిపాల్రెడ్డి, కౌన్సిలర్లు శ్వేతారెడ్డి, మొగులప్ప, రాములు, నాయకులు, విద్యార్థులు, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.