మూసాపేట(అడ్డాకుల), ఆగస్టు 14 : దళితబంధు పథకంతో లబ్ధిదారులు కష్టపడి పనిచేసి ఆర్థికంగా ఎదిగి ఆదర్శంగా నిలవాలని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. ఆదివారం అడ్డాకుల మండలం తిమ్మాయిపల్లికి చెందిన దళితబంధు లబ్ధిదారులు మన్యంకొండకు ట్రాక్టర్, రాములుకు ట్రాక్టర్, రామాంజనేయులుకు టాటా ఆటో, చంద్రయ్యకు ట్రాక్టర్, రాములుకు డెయిరీ, బాలచందర్ వస్త్ర దుకాణం, పరశురాంకు డీజే సౌండ్స్, మన్యానికి సెంట్రింగ్ దుకాణం, వెంకటేశ్కు ఫొటో స్టూడియోను స్థానిక టీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గానికి ఇచ్చిన 100 యూనిట్లు విజయవంతమైతే తనతోపాటు సీఎం కేసీఆర్ సంతోషిస్తారన్నారు.
అదేవిధంగా అడ్డాకులకు చెందిన కుమ్మరి చెన్నయ్య, గొల్ల శేఖర్, రాచాలకు చెందిన లక్ష్మమ్మ, పొన్నకల్కు చెందిన చిన్న రాములు, కాటవరానికి చెందిన చంద్రయ్యకు రైతుబీమా సాయం రూ.5 లక్షల చొప్పున మొత్తం రూ.25 లక్షల చెక్కులను బాధిత కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే పంపిణీ చేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ నల్లమద్ది రాజశేఖర్రెడ్డి, ఎంపీపీ దోనూరు నాగార్జునరెడ్డి, వైస్ ఎంపీపీ రాచాల రాధిక, ఎంపీడీవో మంజుల, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, విండో చైర్మన్ జితేందర్రెడ్డి, సర్పంచుల సంఘం మండలాధ్యక్షుడు జయన్నగౌడ్, కోఆప్షన్ ఖాజాగోరీ, మహిళా సెల్ అధ్యక్షురాలు సుజాత పాల్గొన్నారు.