అమరచింత, ఆగస్టు 13 : జూరాల ప్రాజెక్టుకు వరద కొనసాగుతున్నది. శనివారం సాయంత్రానికి 2.56 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదైంది. దీంతో డ్యాం 38 స్పిల్వే గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. విద్యుదుత్పత్తి కోసం 26,461 క్యూసెక్కులు వినియోగించినట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. భీమా లిఫ్ట్-2కు 750, ఎడుమ కాల్వకు 640, కుడి కాల్వకు 442 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. మొత్తంగా 2,69,785 క్యూసెక్కుల అవుట్ఫ్లో నమోదవుతున్నట్లు అధికారులు తెలిపారు.
సుంకేసుల 23 గేట్ల నుంచి..
రాజోళి, ఆగస్టు 13 : సుంకేసుల డ్యాం 23 గేట్ల నుంచి నీటి విడుదల కొనసాగుతున్నట్లు జేఈ రాజు తెలిపారు. శ నివారం 93 వేలకుపైగా క్యూసెక్కుల ఇన్ఫ్లో రాగా 23 గే ట్లు మీటర్ మేర ఎత్తి దిగువకు 90,945 క్యూసెక్కులు, కేసీ కెనాల్కు 2,095 క్యూసెక్కులు విడుదల చేశారు.
టీబీ డ్యాం 33 గేట్లు ఎత్తివేత
అయిజ, ఆగస్టు 13 : తుంగభద్ర ఉప్పొంగడంతో టీబీ డ్యాం 33 గేట్లు ఎత్తారు. శనివారం డ్యాంలో 1,13,653 క్యూసెక్కులు ఇన్ఫ్లో, 1,13,653 క్యూసెక్కుల అవుట్ఫ్లో నమోదైంది. 105.788 టీఎంసీల పూర్తిస్థాయి నీటి నిల్వకుగానూ ప్రస్తుతం 103.339 టీఎంసీలు నిల్వ ఉన్నది. ఆర్డీఎస్ ఆనకట్టకు 1,14,513 క్యూసెక్కులు ఇన్ఫ్లో ఉండ గా, 1,14,100 క్యూసెక్కులు అవుట్ఫ్లో నమోదైంది. వరద ఆనకట్టపై నుంచి సుంకేసుల బ్యారేజీకి చేరుతున్నది. ఆయకట్టుకు 413 క్యూసెక్కులు వదిలారు. ప్రస్తుతం ఆనకట్టలో 13.3 అడుగుల మేర నీటి మట్టం ఉన్నది.
శ్రీశైలంలో..
శ్రీశైలం, ఆగస్టు 13 : శ్రీశైలం జలాశయానికి వరద కొ నసాగుతున్నది. శనివారం ప్రాజెక్టులో 4,25,563 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదైంది. పది గేట్లను 15 అడుగుల మేర ఎత్తి 3,76,170, కుడి, ఎడమ విద్యుదుత్పత్తి కేంద్రాల ద్వారా 61,024 క్యూసెక్కులను సాగర్ రిజర్వాయర్కు వి డుదల చేశారు. రిజర్వాయర్ నీటి నిల్వ 215.80 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 211.47 టీఎంసీలు ఉన్నది.