పాలమూరు, ఆగస్టు 13 : సాధారణంగా ఏదైన రాజకీయ పార్టీ నాయకుడు లేదా కార్యకర్త చనిపోతే ఆ పార్టీకి చెందిన నాయకులు అండగా నిలిచి సాయం అందిస్తారు.. అధికారంలో ఉంటే ప్రభుత్వం నుంచి రావాల్సిన పథకాలు త్వరగా అందేలా చూస్తారు.. ప్రతిపక్షంలో ఉంటే కనీసం పార్టీ నాయకుడు, కా ర్యకర్తలు సొమ్ము జమచేసి బాధిత కుటుంబానికి అండగా ఉంటారు. కానీ ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకుడు చనిపోతే అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి ఆదుకొని అం దరికీ ఆదర్శంగా నిలిచారు.
వివరాల్లోకి వెళ్తే.. జిల్లా కేంద్రంలోని బోయపల్లికి చెందిన కాం గ్రెస్ పార్టీ నాయకుడు మురుగని కేశవులు కొంతకాలం కిందట విద్యుత్ ప్రమాదంలో మృతి చెందారు. స్థానిక టీఆర్ఎస్ నాయకు లు అతడి మృతి విషయాన్ని మంత్రి శ్రీనివాస్గౌడ్ దృష్టికి తీసుకెళ్లి అండగా నిలిచారు. మృతుడి వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం సహాయనిధి నుంచి రూ.2 లక్షలు, రైతుబీమా రూ. 5 లక్షల చెక్కులను అందజేశారు. అలాగే టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలందరూ కలిసి రూ.2.68 లక్షలు జమచేసి మృతుడి కుటుంబ సభ్యులకు అందజేసి దాతృత్వం చాటారు. అదేవిధంగా 25 మందికి రూ.39 లక్షల విలువైన సీఎమ్మార్ఎఫ్ చెక్కులను అందజేశారు.