దేవరకద్ర రూరల్, ఆగస్టు 13 : చిన్నచింతకుంట మండలంలోని కురుమూర్తిస్వామి ఆలయంలో శనివారం పవిత్రోత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా వేదపండితులు ప్రత్యేక పూజలు చేశారు. శ్రావణమాసం సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు కుటుంబ సమేతంగా కురుమూర్తిస్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులతో ఆల యం కిటకిటలాడింది.
మన్యంకొండకు భక్తుల తాకిడి
పాలమూరు, ఆగస్టు 13 : మన్యకొండలోని లక్ష్మీవేంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. శ్రావణ శనివారం సందర్భంగా స్వామిని భక్తులు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. గంటల తరబడి బారులుదీరారు. స్వామికి తిరుచ్చి సేవ ఘనంగా నిర్వహించారు. భక్తులు సత్యనారాయణస్వామి వ్రతాన్ని చేశారు. భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త ఆళహరి మధుసూదన్ కుమార్, ఈవో పురేందర్ కుమార్, అర్చకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
ఆలయాల్లో ప్రత్యేక పూజలు
కోయిలకొండ, ఆగస్టు 13 : మండలంలోని నక్కవానికుంట, వాల్యానాయక్తం డా, వింజమూర్, కోయిలకొండ తదితర గ్రామాల్లోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. శ్రావణ శనివారం సందర్భంగా భక్తులు తెల్లవారుజామునుంచే ఆలయాల ను సందర్శించి పూజా కార్యక్రమాలను ని ర్వహించారు. అనంతరం స్వామివారికి పల్లకీసేవ, జల్దిబిందె ఉత్సవాలను నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. కోయిలకొం డ ఆది ఆంజనేయస్వామి ఆలయంలో వింజమూర్ కుమ్మరి రాములు భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
హన్వాడ మండలంలో..
హన్వాడ, ఆగస్టు 13 : మండలంలోని ర్యాకమకొండ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు స్వామివారిని దర్శించుకొని పూజలు చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ బాలరాజు, ఎంపీడీవో ధనుంజయగౌడ్, ఏపీఎం సుదర్శన్, వేణు, కృష్ణ నాయకులు రమణారెడ్డి, గంట రాములు, తిమ్మన్న, రామలింగం తదితరులు పాల్గొన్నారు.