లక్ష్మీకుంట వద్ద కలెక్టర్, ప్రజాప్రతినిధులతో కలిసి మొక్కలు నాటిన మంత్రి
వనపర్తి, ఆగస్టు 10 : అవకాశం ఉ న్న ప్రతి చోటా ఫ్రీడం పార్కుల ఏర్పాటుకు కృషి చేస్తానని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి సూచించారు. భారత స్వతంత్ర వజ్రోత్సవాల లో భాగంగా బుధవారం లక్ష్మీకుంట వ ద్ద ఫ్రీడం పార్కులో కలెక్టర్ షేక్ యా స్మిన్ బాషా, ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రీనివాసపురంలో లక్ష్మీకుంట భవిష్యత్తులో రా ష్ట్రంలో ప్రముఖ ప్రాంతంగా మారబోతున్నదని పేర్కొన్నారు. రూ.కోటిన్నర వె చ్చించి చిన్న కుంటను పెద్ద చెరువుగా మార్చినట్లు తెలిపారు.
ఈ కుంట సమీపంలో 35 ఎకరాల్లో ఫ్రీడం పార్కు ఏ ర్పాటు చేసినట్లు చెప్పారు. వనపర్తిలో 11 వేల ఎకరాల్లో అటవీ ప్రాంతం ఉన్నదని, చెరువుల మూలంగా వివిధ రకాల జీవజాతుల పెంపునకు దోహద పడుతుందన్నారు. చెరువులు, కుంటలు పునరుద్ధరణతో భూగర్భ జలాలు పెరుగుతున్నాయని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తలపెట్టిన స్వతంత్ర వజ్రోత్సవాల లో ప్రజలు భాగస్వాములు కావాలని పి లుపునిచ్చారు. కార్యక్రమంలో జెడ్పీ చై ర్మన్ లోకనాథరెడ్డి, అదనపు కలెక్టర్ వే ణుగోపాల్, మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, మున్సిపల్ కమిషనర్ విక్రమసింహారెడ్డి, కౌన్సిలర్లు కృష్ణయ్య, సత్యం, మహేశ్, నాయకులు పాల్గొన్నారు.
పర్యావరణాన్ని పరిరక్షించాలి..
గోపాల్పేట, ఆగస్టు 10 : పర్యావర ణ పరిరక్షణ కోసం ప్రతి విద్యార్థి మొ క్కలు నాటి సంరక్షించాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగం గా మండలంలోని బుద్ధారం సాంఘిక సంక్షేమ గరుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన వనమహోత్సవ కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. ఎంపీపీ సంధ్య, జెడ్పీటీసీ భార్గవి, సర్పంచ్ పద్మమ్మ, ఎంపీటీసీ శ్రీదేవితో కలిసి మంత్రి ఫ్రీడం పార్కును ప్రాంభించారు. అనంతరం మాట్లాడుతూ ఎన్నో త్యాగాలు, పోరాటాల ఫలితంతోనే స్వాతంత్య్రం సిద్ధించిందన్నారు. ఇప్పటికే 75 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు. మెరుగైన విద్యాబోధన కో సమే సర్కార్ సాంఘిక గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేశామన్నారు.
ప్రతి విద్యార్థి 5 మొక్కలు నాటి వాటికి తల్లి, తండ్రీ కుటంబ సభ్యుల పేర్లు నామకర ణం చేసి సంరక్షించాలని సూచించారు. అనంతరం విద్యార్థులను మంత్రి పలు ప్రశ్నలు అడిగారు. ప్రోత్సాహకంగా నగ దు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో హుస్సేనప్ప, ఏపీవో నరేందర్, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు తిరుపతి యాదవ్, టీ ఆర్ఎస్ మండలాధ్యక్షుడు కోదండం, కోఆప్షన్ సభ్యులు మతీన్, టీఆర్ఎస్ నా యకులు కోటీశ్వర్రెడ్డి, రాజు, విష్ణువర్ధన్రావు, నాగరాజు, పంచాయతీ కార్యదర్శి రమేశ్నాయుడు, ప్రిన్సిపాల్ ఆరో గ్యం, ఉపాధ్యాయులు ప్రసన్న, రేణుక, శ్రీలత, హరిత, హబీబా పాల్గొన్నారు.