మహబూబ్నగర్ టౌన్, ఆగస్టు 10 దేశానికి స్వా తంత్య్రం వచ్చి ఇన్నేండ్లయినా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే ఈ ప్రాంతంలో ప్రజలకు భరోసా ఏర్పడిందని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా బుధవారం జిల్లా కేంద్రంలోని ఎస్వీఎస్ నుంచి ఏనుగొండ వరకు వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భం గా మాట్లాడుతూ నాడు కరువుతో తల్లడిల్లిన ఉమ్మడి పాలమూరు జిల్లా నేడు పచ్చదనంతో పరిఢవిల్లుతుందని చెప్పారు. రాష్ట్రం ఏర్పాడిన తర్వాత సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ర్టాభివృద్ధి సాధ్యమైందన్నారు. గతంలో జిల్లా కేంద్రంలో ఒక్క పెద్ద పార్కు ఉండేది కాదని.. ఇప్పుడు పెద్ద ఎత్తున ఏర్పాటు చేశామన్నారు. రోడ్డుకి రువైపునా ఫుట్పాత్పై పాదచారులకు ఇబ్బంది కాకుం డా కుండీలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
ప్రజలు మొక్కలు నాటే కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. మొక్కలు నాటడంపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని కోరారు. అధికారులు, ప్రజాప్రతినిధులందరూ కలిసి పచ్చదనం పెంపొందించేందుకు కృషి చేయాలని సూచించారు. అనంతరం జా తీయ జెండాను చేతబట్టి రహదారిపై మంత్రి ర్యాలీగా ముందుకు కదిలారు. కార్యక్రమంలో ఎస్పీ వెంకటేశ్వర్లు, అడిషనల్ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, డీసీసీబీ వైస్ చైర్మన్ కొరమోని వెంకటయ్య, ముడా చైర్మన్ వెంకన్న, మున్సిపల్ వైస్ చైర్మన్ తాటి గణేశ్, అటవీ శాఖాధికారి సత్యనారాయణ, నాయకులు గోపాల్ యాదవ్, కౌన్సిలర్లు వనజ, కట్టా రవికిషన్రెడ్డి, అనంతరెడ్డి, పటేల్ ప్రవీణ్, రాంలక్ష్మణ్, కిశోర్, మాజీ కౌన్సిలర్లు జ్యోతి, పద్మజ, నాయకులు శ్రీనివాస్రెడ్డి, హన్మంతు, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
మట్టి గణపతులను ప్రోత్సహించాలి
మహబూబ్నగర్ రూరల్, ఆగస్టు 10 : కాలుష్య ర హిత వేడుకల కోసం మట్టి గణపతి ప్రతిమలనే పూ జించాలని.. వివిధ రకాల రసాయనాలు, ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో తయారు చేసే విగ్రహాల వల్ల కలిగే కాలుష్యం తో పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. శివశక్తినగర్లో శ్రీకాంతాచారి ఏర్పాటు చేసిన మట్టి గణపతుల స్టాల్ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్ర స్తుతం పర్యావరణ పరిరక్షణపై ప్రపంచ వ్యాప్తంగా వి స్తృత చర్చ సాగుతున్నదన్నారు. అందుకు అవసరమైన చర్యలను తీసుకురావాల్సిన పరిస్థితులు వచ్చాయన్నా రు. పర్యావరణానికి నష్టం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, మట్టి గణపతులను పూజించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, వైస్ చైర్మన్ గణేశ్, కౌన్సిలర్లు తిరుపతమ్మ, రాంలక్ష్మణ్, శ్రీనివాస్రెడ్డి, ప్రశాంత్, కిశోర్, నవకాంత్ పాల్గొన్నారు.