మహబూబ్నగర్ మెట్టుగడ్డ, ఆగస్టు 10 : బాలల సంరక్షణ చట్టాలను అమలుపర్చేందుకు పోలీసు, సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఎస్పీ ఆర్.వెంకటేశ్వర్లు అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం వివిధ శాఖల అధికారులకు బాలల చట్టాలపై శిక్షణాతరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ బాలబాలికలపై చోటుచేసుకుంటున్న నేరాలు, హింస, అక్ర మ రవాణా వంటి అంశాలపై పెద్దఎత్తున్న చర జరగాల్సిన అవసరం ఉందన్నారు. కుటుంబ వ్యవస్థను బలోపేతం చేస్తూ, బాలల రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను పాఠశాల స్థాయి నుంచి మొదలుపెట్టాల్సిన అవసరం ఉందన్నారు. పోలీసుశాఖ పక్షాన షీ పోలీసు, కళాబృందాలు నిరంతరం కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని, అదేవిధంగా విలేజ్ పోలీసు ఆఫీసర్లు కూడా పాఠశాలలు, కళాశాలలను సందర్శిస్తూ బాలలను చైతన్యం చేస్తున్నారని వివరించారు.
అనంతరం జిల్లా లీగల్సర్వీస్ అథారిటీ సెక్రటరీ సంధ్యారాణి మాట్లాడుతూ బాలలపై నేరాలకు పాల్పడే నిందితులకు త్వరితగతిన శిక్ష పడేలా చేయడంవల్ల నేరాలు చేసేవారికి హెచ్చరికలు పంపినట్లు అవుతుందన్నారు. ఈ విషయంలో పోలీసు సహకారంతో సంబంధిత శాఖలన్నీ కలిసి పనిచేయాలని సూచించారు. ఏఎస్పీ రాములు మాట్లాడుతూ జూలైలో నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంలో బాలకార్మికులను ప్రోత్సహిస్తున్న ఐదుగురిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. అలాగే 176మంది బాలలను కార్మిక వ్యవస్థ నుంచి బయటకు తెచ్చామని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి జరీనాబేగం, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ నయీమొద్దీన్, రిసోర్స్పర్సన్ డేవిడ్రాజు, డీఎస్పీలు మహే శ్, రమణారెడ్డి, మధు, ఆదినారాయణ, కోఆర్డినేటర్ వెంకటమ్మ, చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి నర్మద, చైల్డ్ హెల్ప్లైన్ కోఆర్డినేటర్ రాజూనాయక్ తదితరులు పాల్గొన్నారు.
పోలీసు హెడ్క్వార్టర్స్లో వనమహోత్సవం
స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా జిల్లా పోలీసు హెడ్క్వార్టర్స్లో వనమహోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ వెంకటేశ్వర్లు మొక్కలు నాటి నీళ్లు పోశారు. కా ర్యక్రమంలో అదనపు ఎస్పీ రాములు, డీఎస్పీలు మహేశ్, మధు, ఆదినారాయణ, రమణారెడ్డి పాల్గొన్నారు.