జడ్చర్ల, ఆగస్టు 9: ప్రభుత్వం 15రోజుల పాటు నిర్వహిస్తున్న వజ్రోత్సవ వేడుకల్లో ప్రతిపౌరుడూ పాల్గొనాలని ఎమ్మెల్యే డాక్టర్.సి.లక్ష్మారెడ్డి సూచించారు. స్వతంత్ర వజ్రోత్సవాలు సోమవారం నుంచి ప్రారంభం కాగా మంగళవారం జడ్చర్లలోని శ్రీనివాస, దేవి థియేటర్లలో గాంధీ సినిమాను ఉచితంగా ప్రదర్శిస్తున్నారు. థియేటర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని గాంధీ చిత్రపటానికి పూలమాల వేశారు. జాతీయ జెండాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జడ్చర్లలోని రెండు థియేటర్లలో గాంధీ సినిమాను ఉచితంగా ప్రదర్శిస్తున్నారని అన్ని పాఠశాలల విద్యార్థులకు చూయించాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, పీఏసీసీఎస్ అధ్యక్షుడు సుదర్శన్గౌడ్, మున్సిపల్ చైర్మన్ లక్ష్మి, బాద్మి శివకుమార్, ప్రత్యేక కలెక్టర్ ప్రద్మశ్రీ, తాసిల్దార్ లక్ష్మినారాయణ, ఎంఈవో మంజూలాదేవి, ఆర్ఐ రాఘవేంద్ర, ఎర్ర శ్రీను, మార్కెట్ డైరక్టర్ శ్రీకాంత్రెడ్డి, కౌన్సిలర్లు కోట్ల ప్రశాంత్రెడ్డి, ఉమాశంకర్గౌడ్, లత, చైతన్య, సారిక, రమేశ్, సతీశ్, ముడాడైరక్టర్లు ఇమ్ము, ప్రీతం, సర్పంచులు ప్రభాకర్రెడ్డి, ప్రణిల్, రాజేశ్వర్రెడ్డి, రవీందర్రెడ్డి, శ్రీనివాసులు, నర్సింహులు, కమిషనర్ మహమూద్షేక్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రఘుపతిరెడ్డి, నాగిరెడ్డి, దోనూరు శ్రీనివాస్రెడ్డి, శంకర్నాయక్, విజయ్, పవన్ పాల్గొన్నారు.
బాధితలను ఆదుకుంటాం
నవాబ్పేట, ఆగస్టు 9: మండలంలోని యన్మన్గండ్ల పెద్ద చెరువు కట్ట తెగిపోయి పంటలు కోల్పోయిన రైతులను ప్రభుత్వపరంగా ఆదుకుంటామని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి భరోసా ఇచ్చారు. మండలంలోని యన్మన్గండ్ల పెద్ద చెరువు కట్టను మంగళవారం పరిశీలించారు. అనంతరం పంటలు నష్టపోయిన రుక్కంపల్లి గ్రామ రైతులను పరామర్శించి వారితో మాట్లాడారు. చెరువు కింద 100 ఎకరాలకు పైగా వరి నాట్లు ఇసుక దిబ్బల్లో కూరుకుపోయాయని తెలిపారు. వెంటనే సంబంధిత అధికారులతో పంట నష్టం అంచనాలు వేయిస్తామన్నారు.
త్రివర్ణ పతాకం ఎగరాలి
ప్రతి ఒక్కరూ తమ ఇండ్లపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. మండలంలోని యన్మన్గండ్ల గ్రామంలో మంగళవారం నాడు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై గ్రామస్తులకు త్రివర్ణ పతాకాలను పంపిణీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో డీసీఎంఎస్ చైర్మన్ పట్ల ప్రభాకర్రెడ్డి, ఎంపీపీ అనంతయ్య, జెడ్పీటీసీ రవీందర్రెడ్డి, సింగిల్విండో చైర్మన్ నర్సింహులు, వైస్ ఎంపీపీ సంతోష్రెడ్డి, తాసిల్దార్ రాజేందర్రెడ్డి, ఎంపీడీవో శ్రీలత, ఐబీ డీఈ సురేశ్, ఏఈ భాగ్యశ్రీ, ముడా డైరెక్టర్ గండు చెన్నయ్య, రైతుబంధు మండల కోఆర్డినేటర్ మధుసూదన్రెడ్డి, కో ఆప్షన్ సభ్యుడు తాహెర్, సర్పంచులు గోపాల్గౌడ్, జయమ్మ, నాయకులు నాగిరెడ్డి, ప్రతాప్, అబ్దుల్లా, సంజీవరెడ్డి, అంజయ్య, మల్లెపాగ నర్సింహులు, వెంకటేశ్ పాల్గొన్నారు.
జెండాల పంపిణీ
బాలానగర్, ఆగస్టు 9 : ఆగస్టు 15న ప్రతి ఇంటిపై మువ్వన్వెల జెండాను ప్రతి ఒక్కరూ ఎగురవేయాలని ఎంపీపీ కమల అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ పంచాయతీ కార్యదర్శులకు జాతీయ జెండాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో తాసిల్దార్ శ్రీనువాసులు, ఎంపీడీవో కృష్ణారావు, పంచాయతీ కార్యదర్శులు పాండు, అనిల్, బాసు రాథోడ్, జగన్, ఆంజనేయులు, వినోద్ ఉన్నారు.
సామాజిక సేవకు అవార్డులు
జడ్చర్ల, ఆగస్టు 9: కరోనా సమయంలో తమవంతు సాయంగా సామాజిక కార్యక్రమాలు చేసిన కార్యకర్తలకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అవార్డులను అందజేశారు. జడ్చర్లలోని ప్రేమ్రంగా గార్డెన్స్లో మంగళవారం మన సేవా సమితి ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. సమితి సభ్యులు కరోనా సమయంలో తమవంతు సాయంగా సేవా కార్యక్రమాలను చేసిన వారిని గుర్తించి అందులో ఉత్తమ కార్యకర్తలను ఎంపిక చేసి వారికి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అవార్డులను అందజేశారు. కార్యక్రమంలో సమితి అధ్యక్షుడు వేణు, ఉపాధ్యక్షుడు రవీందర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి రాఘవేందర్, రమణారెడ్డి, బాద్మి శశాంక్, బాలమణి ఉన్నారు.