ఊట్కూర్, ఆగస్టు 8 : త్యాగానికి ప్రతీకగా నిర్వహించుకునే మొహర్రం వేడుకలను మండలంలోని అన్ని గ్రామా ల్లో ప్రజలు, భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకొంటున్నారు. ప్ర త్యేకించి మండలంలో హిందూ, ముస్లింల ఐక్యతకు నిదర్శంగా జరుగుతున్న మొహర్రం (పీర్ల జాతర) సవారీ వేడుకలను తిలకించేందుకు జిల్లా ప్రజలతో పాటు కర్ణాటక, మ హారాష్ట్ర నుంచి భక్తులు సోమవారం వేలాదిగా తరలివచ్చా రు. హసన్, హుస్సేన్ పీర్ల చావిడీ వద్ద భక్తులు సందడి చేశా రు వివిధ గ్రామాల నుంచి పెద్దసంఖ్యలో వచ్చిన భక్తు లు కందూర్లు నిర్వహించి మొక్కుబడులు చెల్లించుకున్నారు. వే డుకల్లో భాగంగా భక్తులు పీర్ల చావిడీ ఎదుట తవ్విన అలా యి గుంత చుట్టూ ప్రదక్షిణలు చేశారు.
పీర్ల చావిడీని సందర్శించిన టీఎస్టీపీసీ మాజీ అధ్యక్షుడు మల్లప్ప
మండలకేంద్రంలో మొహర్రం వేడుకల సందర్భంగా హసన్, హుస్సేన్ పీర్ల చావిడీని, రోషన్వలీ దర్గాను టీఎస్టీపీసీ మాజీ అధ్యక్షుడు దేవరి మల్లప్ప దర్శించుకున్నారు. స్థానిక పంచ్ మసీద్ నుంచి పీర్ల చావిడీ వరకు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో ఊరేగింపుగా వెళ్లి పూలు, దట్టీలను సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ రాష్ట్రంలో నిర్వహించే అన్ని పండుగలకు సీఎం కేసీఆర్ సమప్రాధాన్యతను కల్పిస్తున్నారన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ గోవిందప్ప, కృష్ణయ్య, తిమ్మారెడ్డి, అం జప్ప, అనంతప్ప, రాంరెడ్డి, చావిడీ నిర్వాహ కులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
భక్తులకు వసతుల ఏర్పాటు
పలువురు భక్తులు షాదీఖానా మైదానం, పెద్దపీర్ల గడ్డ సమీపంలో టెంట్లు వేసుకొని కందూర్లు నిర్వహించారు. జిల్లాలోనే ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మొహర్రం వేడుక ల్లో పాల్గొనేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు త లెత్తకుండా సర్పంచ్ సూర్యప్రకాశ్రెడ్డి ఆధ్వర్యంలో గ్రామ సిబ్బంది పారిశుధ్య చర్యలు చేపట్టారు. భక్తులను ప్రత్యేక తాగునీటి వసతిని కల్పించారు. వారం రోజులపాటు ని ర్వహించే పీర్ల జాతరలో భాగంగా చిరు వ్యాపారులు గాజు లు, ఆట బొమ్మలు, మిఠాయి దుకాణాలను ఏర్పాటు చేసుకున్నారు.
వేడుకలకు పటిష్ఠ బందోబస్తు
మండలకేంద్రంలో నిర్వహించే మొహర్రం వేడుకల సం దర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా పటిష్ఠమైన పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేసినట్లు మక్తల్ సీఐ సీతయ్య తెలిపారు. మండలకేంద్రంలో రెండు రోజులు సో మవారం, మంగళవారం నిర్వహించే మొహర్రం సందర్భం గా వివిధ పోలీస్స్టేషన్లకు సంబంధించిన ముగ్గురు సీఐలు, 10 మంది ఎస్సైలతోపాటు వివిధ విభాగాలకు చెందిన 150 మంది పోలీసులను నియమించారు. సోమవారం స్థా నిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో వేడుకలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సీఐ వివరించారు. ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉంటూ తమకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్సై రాములు పాల్గొన్నారు.