మరికల్, ఆగస్టు 8 : ముదిరాజ్ల ముద్దుబిడ్డ సర్దార్ స ర్వాయి పాపన్నగౌడ్ జయంతిని ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో మండలంలోని తెలంగాణ చౌరస్తాలో సోమవారం ఘనంగా నిర్వహించారు. పాపన్నగౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు చంద్రశేఖర్, నాయకులు కొండన్న, కుర్మన్న, శేఖర్, శ్రీనివాసు లు, రాజు, కృష్ణయ్య, రవికిరణ్, మొగులప్ప, రాజేశ్, గొల్ల శ్రీనివాసులు, సత్యన్న, మడ్డిరాజు పాల్గొన్నారు.
ధన్వాడ మండలంలో..
ధన్వాడ, ఆగస్టు 8 : సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జ యంతిని మండలంలోని బీసీ కాలనీలో ముదిరాజ్ సం ఘం ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి పూ జలు చేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీఎస్పీ జి ల్లా ఇన్చార్జి శ్రీనివాసులు మాట్లాడుతూ పాలమూరు గడ్డపై పాపన్నగౌడ్ పోరాటం ఎంతో మంది బహుజనుల్లో వెలుగులు నింపాండన్నారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో మత్స్యశా ఖ మండల అధ్యక్షుడు నర్సింహులు నాయుడు, జిల్లా ఉపాధ్యక్షుడు చం ద్రయ్య, బాలచందర్, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.
పేదల హృదయాల్లో చెరగని ముద్ర
పేదల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకు న్న నాయకుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ అని ముదిరాజ్ యూత్ నాయకులు అన్నారు. పట్టణంలోని సర్దార్ స ర్వాయి పాపన్నగౌడ్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి మక్తల్ ముదిరాజ్ యువకులు పూజలు చేసి ఆయనను స్మరించుకున్నారు. కార్యక్రమంలో పృథ్వీరాజ్, నర్సింహ, రమేశ్, శేఖర్, నవీన్కుమార్, అభిషేక్, యాదగిరి, రమేశ్, సంతోష్, ఆనంద్, రాజ్, శంకర్, వినయ్, హిమాన్షు, నవీన్ తదితరులు పాల్గొన్నారు.